ఇరిగేషన్ ఎస్ఈలపై బదిలీ వేటు | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్ ఎస్ఈలపై బదిలీ వేటు

Published Sat, Mar 14 2015 8:57 AM

Two irrigation SE's transfer in ysr kadapa district

కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇద్దరు ఇరిగేషన్ ఎస్ఈలపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ శంకర్రెడ్డి, జీఎన్ఎస్ఎస్లో ఎస్ఈ గోపాల్రెడ్డిలను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జనవరి 13వ తేదీన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సదరు అధికారులు ఇద్దరు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిందని ఇరిగేషన్ శాఖ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement