తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో అంబేద్కర్ ఫ్లెక్సీ విషయంలో వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.
ఆలమూరు: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో అంబేద్కర్ ఫ్లెక్సీ విషయంలో వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఒక సామాజిక వర్గానికి చెందిన ముగ్గురితో పాటు మండపేట రూరల్ పోలీస్టేషన్కి చెందిన కానిస్టేబుల్ తలకు కూడా గాయాలయ్యాయి. బుధవారం రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత గుమ్మిలేరు సెంటరులో(రావులపాలెం మండపేట రోడ్డులో) ఒక సామాజిక వర్గం ఫ్లెక్సీ పెడుతుండగా మరో సామాజిక వర్గం యువకులు అడ్డుకున్నారు. దీంతో వివాదం తలెత్తింది. విషయం తెలిసిన పోలీసులు ఎటువంటి ఘర్షణ తలెత్తకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.