వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో ఇద్దరు క్రికెట్ బుకీలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.
వైఎస్సార్ జిల్లా (ప్రొద్దుటూరు) : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో ఇద్దరు క్రికెట్ బుకీలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండులో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరి నుంచి రూ.5.30 లక్షలు, ఓ ఇండికా కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు ప్రొద్దుటూరుకు చెందిన యేలి నాగరాజు కాగా, మరొకరు ప్రొద్దుటూరు రూరల్ మండలానికి చెందిన కోటగిరి గ్రామస్తుడు సింగనమల రమేష్గా పోలీసులు తెలిపారు.