ఇద్దరు క్రికెట్ బుకీలు అరెస్ట్ | Two Cricket bookies arrested | Sakshi
Sakshi News home page

ఇద్దరు క్రికెట్ బుకీలు అరెస్ట్

Aug 4 2015 6:26 PM | Updated on Apr 4 2019 4:46 PM

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో ఇద్దరు క్రికెట్ బుకీలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

వైఎస్సార్ జిల్లా (ప్రొద్దుటూరు) : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో ఇద్దరు క్రికెట్ బుకీలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండులో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరి నుంచి రూ.5.30 లక్షలు, ఓ ఇండికా కారు, రెండు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు ప్రొద్దుటూరుకు చెందిన యేలి నాగరాజు కాగా, మరొకరు ప్రొద్దుటూరు రూరల్ మండలానికి చెందిన కోటగిరి గ్రామస్తుడు సింగనమల రమేష్‌గా పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement