మెదక్లో టీఆర్ఎస్, నందిగామలో టీడీపీ ముందంజ | Sakshi
Sakshi News home page

మెదక్లో టీఆర్ఎస్, నందిగామలో టీడీపీ ముందంజ

Published Tue, Sep 16 2014 8:50 AM

trs, tdp leads in medak lok sabha, nandigama assembly seats

హైదరాబాద్ : మెదక్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. టీఆర్‌ఎస్‌కు 4710 ఓట్లు, కాంగ్రెస్‌కు 1840 ఓట్లు, బీజేపీకి 1710 ఓట్లు వచ్చాయి. ఇక మెదక్‌ లోక్‌సభకు మొత్తం 22 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా టీఆర్‌ఎస్-10, బీజేపీ-9, కాంగ్రెస్-1, రెండు తిరస్కరణకు గురయ్యాయి.

 

మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. ఇక కృష్ణాజిల్లా నందిగామలో తొలి రౌండ్లో  టీడీపీ ముందంజలో ఉంది. మొదటి రౌండ్‌లో టీడీపీకి 5680 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ టీడీపీకి కేవలం కాంగ్రెస్ మాత్రమే ప్రత్యర్థి.

 

Advertisement
Advertisement