ఇక్కడి ప్రజల ఉసురుపోసుకుంటున్న బాబు: హరీశ్ | trs leader fire on ap cm chandra babu | Sakshi
Sakshi News home page

ఇక్కడి ప్రజల ఉసురుపోసుకుంటున్న బాబు: హరీశ్

Sep 29 2014 2:14 AM | Updated on Sep 18 2018 8:38 PM

తెలంగాణకు కరెంట్ సరఫరా చేయనివ్వకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడుతూ ఇక్కడి ప్రజల ఉసురు

సిద్దిపేట: తెలంగాణకు కరెంట్ సరఫరా చేయనివ్వకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడుతూ ఇక్కడి ప్రజల ఉసురు పోసుకుంటున్నారని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని, మాట్లాడారు.

రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు తెలంగాణకు 53 శాతం విద్యుత్ ఇవ్వాలని ఢిల్లీలో ఒప్పందం కుదిరినప్పటికీ ఆ మాటను చంద్రబాబు లెక్కచేయడం లేదన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, ప్రతి రైతు తీసుకున్న రుణాన్ని మాఫీ చేసి తీరుతామన్నారు. పైరవీకారులను నమ్మొద్దని, ఏ అవసరమున్నా తానున్నానంటూ హరీశ్ ప్రజలకు భరోసా ఇచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement