సాక్షి,గుంటూరు
జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం కురిసిన కుండపోత వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రహదారులు నీట మునిగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పైర్లు నీట మునిగాయి. పట్టణ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
జిల్లాలోని మేడికొండూరులో అత్యధికంగా 20.04 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడులో 16.02, ఫిరంగిపురం 15.80, యడ్లపాడు 14 , గుంటూరు 9.22, పెదకూరపాడులో 8.29 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఏడు సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదైంది.
జిల్లాలో అధిక శాతం పైర్లు వరద నీట మునిగాయి. దాదాపు నెల రోజుల కిందట వేసిన పైర్లు కావడంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే, వెయ్యి హెక్టార్లలోపు పైర్లు మాత్రమే నీట మునిగి దెబ్బతినే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
తాడికొండ మండలం లాం వద్ద కొండవీటివాగు పొంగి పొర్లడంతో చప్టాపై నుంచి భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో అందులో ఓ గుర్తుతెలియని మహిళ గల్లంతైంది. ఆమెను రక్షించేందుకు షేక్బాజీ అనే వ్యక్తి చేసిన ప్రయత్నం ఫలించలేదు. కంతేరు వద్ద ఎర్రవాగు లో ఎం.వాసుదేవరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు.
నల్లపాడు-పేరేచర్ల మధ్య వరద నీటి ఉధృతికి రైల్వే ట్రాక్ కట్ట కొట్టుకుపోవడంతో పట్టాలు గాలిలో ఉన్నాయి. ఆ సమయంలో వస్తున్న హుబ్లీ ప్యాసింజర్ డ్రైవర్ గుర్తించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
మేడికొండూరులో చప్టాపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో గుంటూరు - మాచర్ల రహదారిపై భారీ సంఖ్యలో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
పెదకూరపాడు గ్రామంలో పిడుగుపడి అంకమ్మతల్లి దేవాలయం పాక్షికంగా దెబ్బతింది. చినమక్కెన వద్ద కల్వర్టు కొట్టుకుపోవడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
నరసరావుపేట పట్టణం ఎస్ఆర్కేటీ కాలనీతోపాటు పలు కాలనీల్లోకి నీరు రావడంతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
చిలకలూరిపేట పట్టణంలో దాదాపు అన్ని కాలనీలు జలమయమయ్యాయి. గడియారస్తంభం సెంటర్లో షాపులు నీట మునిగి రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. ఓగేరు, కుప్పగంజి, నక్క వాగులు పొంగి పొర్లుతున్నాయి.
{పత్తిపాడులో చిన్న చెరువు పొంగి కాలనీలు జలమయమయ్యాయి. కోయవారిపాలెం కొండవాగు పొంగి ఎస్సీ కాలనీని ముంచెత్తింది. గొట్టిపాడులో నక్కవాగు పొంగి రాకపోకలు స్తంభించాయి.
చిలకలూరిపేట మండలం మురికిపూడి కొత్తచెరువుకు గండి పడి వందల ఎకరాల్లో పైర్లు నీట మునిగాయి. పసుమర్రు -అనంతవరం మార్గంలో రాకపోకలు స్తంభిం చాయి. అలాగే యడ్లపాడు- ఫిరంగిపురం మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
నరసరావుపేట తహశీల్దారు కార్యాలయం పైకప్పు వర్షానికి నాని పెచ్చులూడి కిందపడడంతో కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి.
మేడికొండూరు మండలం కొర్రపాడులో మంచినీటి చెరువు పొంగడంతో గ్రామం జలమయమైంది.
కుండపోత
Published Fri, Sep 19 2014 12:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement