జ్యువెలరీ షాపులో ముగ్గురు అనుమానాస్పద మృతి | Three Suspects in deaths in ysr district | Sakshi
Sakshi News home page

జ్యువెలరీ షాపులో ముగ్గురు అనుమానాస్పద మృతి

Oct 2 2014 12:30 PM | Updated on Aug 28 2018 7:14 PM

వైఎస్ఆర్ జిల్లాలో ఓ నగల దుకాణంలో ముగ్గురు సిబ్బంది అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ జిల్లాలో ఓ నగల దుకాణంలో ముగ్గురు సిబ్బంది అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రొద్దుటూరులోని తళ్లెం నగల దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం షాపు తెరచిన సిబ్బంది ముగ్గురు మృతి చెందటాన్ని గమనించారు.

 

వారు  పొగ వల్ల ఊపిరి ఆడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాజమాన్యం కూడా దీనిపై పెదవి విప్పటం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి యత్నం జరిగిందా? లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement