ముగ్గురిని బలి తీసుకున్న లారీ | three killed in lorry accident | Sakshi
Sakshi News home page

ముగ్గురిని బలి తీసుకున్న లారీ

Mar 3 2015 11:21 PM | Updated on Aug 28 2018 7:14 PM

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు.

పిడుగురాళ్ల(గుంటూరు): ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదం మంగళవారం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది. వివరాలు.....పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన పణితి రాజేష్(20) అలియాస్ రూపి తన బంధువుల పిల్లలతో కలిసి బైక్‌పై వెళుతుండగా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట లారీ ఢీకొట్టింది.

 

ఈ ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వసంత(17), ఆనంద్‌పాల్(4)లను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement