స్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందని.. ఆత్మహత్యాయత్నం | three commit suicide in anantapur district | Sakshi
Sakshi News home page

స్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందని.. ఆత్మహత్యాయత్నం

Jun 24 2015 4:58 PM | Updated on Sep 3 2017 4:18 AM

స్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందని.. ఆత్మహత్యాయత్నం

స్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందని.. ఆత్మహత్యాయత్నం

రోజూ స్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందని విషపు గుళికలు మింగి ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేశారు.

యాడికి (అనంతపురం): రోజూ స్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందని విషపు గుళికలు మింగి ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం వెంగన్నపల్లి గ్రామ శివారులో ఉన్న కొండమీద బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి అనే ముగ్గురు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే ఇష్లం లేని ఆ ముగ్గురూ కలిసి విషపు గుళికలను పొడిగా చేసుకుని నీళ్లలో కలుపుకుని తాగారు. వారి పరిస్థితి విషమంగా ఉండటం గమనించిన స్థానికులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement