breaking news
nageswar reddy
-
శుభమస్తు.. ఆరోగ్య‘మస్త్’
కొత్త ఏడాది నాడు.. పెద్దలు దీవెనలిస్తారు.. ఫ్రెండ్స్ విషెస్ చెబుతారు .. పిల్లలకు కానుకలిస్తారు మరి పెద్ద పెద్ద డాక్టర్లో..? కొత్త సంవత్సరంలో ‘అందరికీ ఆరోగ్యమస్తు’ అని దీవిస్తూనే.. ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహా–సూచనలను ‘కన్సల్టేషన్’గా అందిస్తున్నారు. దాన్నే సమగ్రంగా, సంక్షిప్తంగా, చిరు కానుకగా ప్రత్యేక పేజీ రూపంలో ‘సాక్షి’ అందిస్తోంది. ‘ఓమ్’ ప్రథమం గట్ బయోమ్జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. గతంలో జీర్ణవ్యవస్థ అనేది కేవలం జీర్ణం చేయడానికి ఉపయోగడపతుందని అనుకున్నారు. ఇటీవలి పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే జీర్ణవ్యవస్థలో కోటాను కోట్ల బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగీ వంటి జీవులు నివసిస్తుంటాయనీ, ‘గట్ బయోమ్’గా పేర్కొనే వీటి సమతౌల్యత వల్లనే మానసిక ఆరోగ్యం, వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడం వంటివన్నీ ఆధారపడి ఉంటాయని తెలిసింది.అంటే ఓ వ్యక్తి ఆహారం అరిగించడంలోనే కాకుండా, అతడు తినే పదార్థాల తీరు తెన్నులు అతడి మానసిక ఆరోగ్యాన్నీ, రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్దేశిస్తుంటాయన్నమాట. ఈ బయోమ్ వ్యవస్థ బాగుంటేనే... ఓ వ్యక్తితాలూకు భావోద్వేగాలు (మూడ్స్), నిద్ర, అతడి మానసిక ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయి. మంచి జీవనశైలిని అనుసరిస్తూ, పూర్తిగా సమతులాహారం తీసుకుంటూ ఉంటే గట్ బయోమ్ సమతౌల్యత బాగుంటుంది. మన భారతీయ సంప్రదాయ ఆహారంలో మొక్కలూ, వృక్షాల నుంచి లభ్యమయ్యే ఆహారం తీసుకుంటుంటాం. అంటే... మనం తినే అన్నంలోనే కాయధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కాయగూరలతో పాటు పులవడానికి సిద్ధంగా ఉండే ఇడ్లీ, దోశలు, భోజనం చివర్లో పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయాటిక్ ఆహారాలను తీసుకుంటాం. ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ను ఆరోగ్యకరంగా, సమతౌల్యంగా ఉండేలా చూస్తాయి. ఇటీవల మనం తీసుకుంటున్నప్రాసెస్డ్ ఫుడ్, చక్కెరతో చేసే తీపిపదార్థాల్లో ఇవి అంతగా ఉండవు. అందుకే మంచి సమతులాహారం తీసుకోవడంతో పాటు మంచి జీవనశైలిలో భాగంగా ఒంటికి తగినంత శ్రమ కలిగేలా తేలికపాటి వ్యాయామాలు, వేళకు కంటి నిండా నిద్రపోవడం వంటి చర్యలతో గట్ బయోమ్ సమతౌల్యత సమర్థంగా నిర్వహితమవుతూ ఉంటుంది. దీనివల్ల మంచి జీర్ణక్రియ, తిన్నది ఒంటికి పట్టడమే కాకుండా మంచి మూడ్ (భావోద్వేగాల) నిర్వహితమవుతుండటం, వ్యాధి నిరోధక వ్యవస్థ చురుగ్గా, క్రియాశీలకంగా మారడం, పూర్తిస్థాయి భౌతిక, మానసిక ఆరోగ్యాల నిర్వహణ జరుగుతాయి. అందుకే స్వాభావికమైన, పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు, పులవడానికి సంసిద్ధంగా ఉండే పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్, తేలికపాటి వ్యాయామాలతో గట్ బయోమ్ సమతౌల్యతతో నిర్వ‘హిత’మయ్యేలా చూసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. - డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ,సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ చైర్పర్సన్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకదలికే ‘కీళ్ల’కంపోషకాలు తీసుకోవడానికి జాయింట్స్కు నోరు లేదు. అదెలాగంటారా? మన దేహంలోని ప్రతి కణానికీ రక్తం ద్వారా పోషకాలూ, ఆక్సిజన్ అందుతాయి. రక్తప్రసరణ వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉండటం వల్ల వాటికి నేరుగా న్యూట్రియెంట్స్ (పోషకాలు) అందుతాయి. కానీ, కీళ్ల విషయం వేరు. అవి రక్తప్రసరణ వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉండవు. మరి వాటికి పోషకాలు అందడమెలా? కీళ్లు ఎంతగా కదులుతుంటే అంతగా వాటికి పోషకాలు అందుతాయి. ఒకవేళ శరీరం కదలికలు మందగించి, కీళ్లలో కదలిక లేకపోతేనో?... అప్పుడు వాటికి పోషకాలు అందవు. నేరుగా రక్తప్రసరణ వ్యవస్థతో అనుసంధానమై ఉన్న కణాలకు ఉన్నట్లు వాటికి సప్లై ఉండదు కాబట్టే... వాటికి నోరు లేదు అన్నది. నోరున్న వాడు నోరు చేసుకు బతుకుతాడు. మరప్పుడు నోరు లేని కీళ్లు కష్టం చేసుకుని బతకాల్సిందే కదా. అందుకే కీలాడితే గానీ వాటికి బతుకాడదు. అందుకే కీళ్ల ఆరోగ్యం బాగుండాలంటే, వాటికీ పోషకాలు అందాలంటే వ్యాయామం తప్పనిసరి అన్నమాట. ఇక మరోమాట... ఎవరిలోనైనా కీళ్లు బాగా అరిగిపోతే (అంటే కీళ్లపై ఉండే కార్టిలేజ్ అనే ΄పోర అరిగితే) అప్పుడు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది కీళ్లలోకి ఇంజెక్షన్ ఇస్తామంటూ పీఆర్పీలు, స్టెరాయిడ్స్ ఎక్కిస్తారు. అవి అందగానే నొప్పులన్నీ తగ్గుతాయి. దాంతో ఇంజెక్షన్తోనే నొప్పి అంతా తగ్గిపోయిందంటూ చాలామంది ఆనందపడతారు. అలాంటి ఇంజక్షన్స్ చేయమంటూ ఆర్థోపెడిక్ సర్జన్ల దగ్గరికి రోజూ పదుల సంఖ్యలో వస్తుంటారు. నాలుగో స్టేజీలో ఉన్న మోకాళ్ల ఆర్థరైటిస్కి ఏ డాక్టర్ అయినా పీఆర్పీ ఇంజెక్షన్ ఇస్తే అతడు డాక్టర్ కాదు... ఆపరేషన్ అంటే భయపడే అమాయకులైన పేషెంట్లను మోసం చేస్తున్నాడని గ్రహించాలి. ఇంజెక్షన్ చేయడమనేది ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులు మొదలు కాం΄ûండర్లూ చేయగలిగేదే. స్టెరాయిడ్స్ ఇవ్వడంతో తొలుత నొప్పులు ఉపశమించినట్లు కనిపించినా... ఆ తర్వాత అవి బోలుగా మారడం, తేలిగ్గా విరగడం జరుగుతుంది. మహామహా కీళ్లమార్పిడి నిపుణులు చిన్నపాటి ఇంజెక్షన్ చేయలేరా? ఎందుకు చేయరంటే బాధితుల పాలిట అదో ద్రోహం. వాళ్ల ఎముకల్ని గుల్ల చేసేసే ఓ అనైతిక (అన్ ఎథికల్) పద్ధతి. అందుకే కీళ్లు పూర్తిగా అరిగాక ఎవరైనా ఇంజెక్షన్స్తో మాన్పిస్తామంటే... వాళ్లు నొప్పి నివారణ మందులూ, స్టెరాయిడ్స్ కలిపి ఇంజెక్షన్ చేస్తూ, దీర్ఘకాలికంగా ఎముకల్ని గుల్ల గుల్ల చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. -డాక్టర్ గురవారెడ్డి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల నిపుణులుమూత్ర పిండం బ్రహ్మాండంగా ఉండాలంటే..గతంలో పెద్దవయసు వారిలోనే కనిపించే చాలా ఆరోగ్య సమస్యలు ఇప్పుడు చిన్నవయసు వారిలోనూ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇటీవల పెరిగిన ఆరోగ్య స్పృహ కారణంగా ముందుగానే చేయిస్తున్న వైద్య పరీక్షల వల్ల అనేక జబ్బులు బయటపడటమూ జరుగుతోంది. దీనివల్ల రెండు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటిది... జబ్బులు బయటపడటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా పెరిగిందనేది ఆందోళన కాగా... ఇక రెండో అంశం... ఆరోగ్యస్పృహ ఇంతగా పెరగకపోయి ఉంటే, అవి మరింత ముదిరాక బయటపడి ఇంకా సమస్యాత్మకంగా మారేవనే పాజిటివ్ అంశం.ఉదాహరణకు గతంలో మూత్రవ్యవస్థకు సంబంధించిన జబ్బుల్లోనూ కిడ్నీల్లో రాళ్లు, పెద్దవయసువారిలో మూత్ర విసర్జన కష్టం కావడం ఇక డయాబటిస్, హైపర్టెన్షన్ బాధితుల్లో కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి సాధారణంగా కనిపించే సమస్యలు. కానీ ఇటీవల యుక్తవయసువారిలోనూ, ఆమాటకొస్తే చాలా చిన్నపిల్లల్లోనూ కిడ్నీలో రాళ్ల సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణం కావచ్చు. మన ఆహారపు అలవాట్లు, కలుషిత వాతావరణం, జీవనశైలి మార్పులు వంటివి కారణాలు కావచ్చు. అయితే ఇప్పుడు ఓ ఆరోగ్య సమస్య వచ్చిందంటే... ఉదాహరణకు ‘కిడ్నీలో రాళ్లు’ సమస్యను తీసుకుంటే... ఇటీవల అత్యాధునికమైన వైద్య ప్రక్రియలూ, లేజర్లు, రొబోటిక్ సర్జరీలూ అందుబాటులోకి రావడంతో కోత, గాటూ లేకుండా, రక్తం చిందకుండా సర్జరీ చేస్తున్నామని అనుకోవడం తప్ప అసలివి రాకుండా చేసుకోవడానికి నివారణలేమిటి అనే ఆలోచనకు తావులేకుండా పోయింది. నిజానికి మనం ఆలోచించాల్సింది వ్యాధుల నివారణ గురించే. ఉదా: కిడ్నీలు, మూత్ర వ్యవస్థ విషయానికి వస్తే... రాళ్లు ఏర్పడటానికి ఆస్కారమిచ్చే ఆహారానికి దూరంగా ఉండటం, నీళ్లు ఎక్కువగా తాగుతుండటం వంటి నివారణ చర్యల గురించి గురించి ఆలోచించాలి. సమాజంలో ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ సమస్య కూడా పెరిగింది. వీటన్నింటికీ కారణం మన జీవనశైలిలోని మార్పులే. దీనికి తోడు మన జీవితాల్లో పెరుగుతున్న తీవ్రమైన ఒత్తిడి (స్ట్రెస్) కూడా మరో ప్రధాన కారణం. దీనివల్లనే హైబీపీ, డయాబెటిస్... మళ్లీ వీటివల్లనే కిడ్నీ జబ్బులు... ఇలా ఓ చైన్ రియాక్షన్లా కొనసాగుతున్నాయి. ఇవన్నీ జీవనశైలిలో మార్పుల వల్ల జరుగుతున్నాయని గ్రహించి మన లైఫ్స్టైల్ను పునర్నిర్వచించుకొని హెల్దీ జీవనశైలిని అనుసరించాలి. -డాక్టర్ మల్లికార్జున ఎండీ అండ్ చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీమీరు బరువైతే గుండె చెరువేగుండెను అందరూ పదిలంగా చూసుకోవాల్సిన అవసరముంది. అందుకు కొన్ని సూచనలు... ⇒ మనం మన ఒత్తిడి (స్ట్రెస్)కి కారణమైన అంశాలని చెబుతున్న వాటిల్లో 90 శాతం అంశాలు అంతగా ఒత్తిడికి గురిచేసేవే కాదు. అసలు స్ట్రెస్ కంటే... మనం దానికి భయపడుతున్న తీరే ఎక్కువగా ఒత్తిడికి గురిచేస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలనే పరిష్కార మార్గాలు ఆలోచిస్తే స్ట్రెస్ దానంతట అదే తగ్గిపోతుంది. ⇒ మహిళలకు ప్రత్యేకంగా చెబుతున్న విషయమేమిటంటే... నిత్యజీవితంలోని ఒత్తిడి (స్ట్రెస్) పురుషులకంటే మహిళలకే ఎక్కువగా హాని చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. మహిళలు ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం గుండెకు మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ వల్ల గుండెకు కలిగే రక్షణ తొలగిపోతుంది కాబట్టి వయసు పెరుగుతున్న కొద్దీ మానసిక స్థైర్యాన్ని మరింతగా పెంచుకుంటూ, సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరముంది.ఇందుకోసం చేయాల్సిన పనులూ సులువు కూడా. మొబైల్ ఫోన్ను పరిమితంగా వాడితే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే టెలివిజన్కే అంటిపెట్టుకొని ఉండటం. ఒకేచోట కూర్చుని అదేపనిగా వీటిని వాడుతుంటే స్థూలకాయం వస్తుంది. ఇది కేవలం గుండెకే కాదు... అనేక ఆరోగ్య అనర్థాలకు కారణం. ఆరోగ్యకరమైనవి తింటూ, తగినంత వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా ఉంటే కేవలం గుండెజబ్బులే కాదు... ఇతర వ్యాధులూ తగ్గుతాయి. -డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిమ్స్ హాస్పిటల్స్ఈ ఎన్ టీ ‘తల’మానికంమన ముక్కు చెవులనూ, అలాగే మన తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే మెడ... వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ చెవుల సంరక్షణ కోసం... ∙అతి భారీ శబ్దాలు వినికిడి సమస్యను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి. ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలాచేయడం వల్ల అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాకపోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. ఇక ముక్కు ఆరోగ్యం కోసం... ⇒ అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకునేందుకు నీళ్లు తాగుతూ హైడ్రేటిడ్గా ఉండాలి. ⇒ ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్లో మరీ ఎక్కువ) సెలైన్ నేసల్ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. గొంతు ఆరోగ్యం (థ్రోట్ హైజీన్) కోసం... ⇒ స్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్య మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. ⇒గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి చిట్కా. మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితో పాటు ఈ చలి సీజన్లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయని గ్రహించాలి. -డాక్టర్ ఈసీ వినయ కుమార్ హెచ్ఓడీ అండ్ సీనియర్ ఈఎన్టీ సర్జన్, అపోలో హాస్పిటల్స్ఇంటి పని ఒంటికి మంచిదిమంచి వ్యాయామంతో ఇటు కీళ్లూ, అటు గుండె రెండూ ఒకేసారి ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ వ్యాయామాలు చేయడానికి తమకు సమయం లేదంటూ చాలామంది చెబుతుంటారు. ఈరోజుల్లో కొన్ని ఇంటి పనులు అందరూ చేయాలి. ముఖ్యంగా ఇంట్లోని ఇల్లాళ్లతో పాటు ఇంటి మగవాళ్లు కూడా. ఉదాహరణకు... తోటపనీ, వస్తువులు తేవడం, లేవగానే బెడ్షీట్స్ మడతపెట్టడం, ఇల్లు ఊడ్చటం, తుడవడం ఇవన్నీ ఇంట్లోని మహిళలు చేయాల్సిన పనులుగా చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ ఇవన్నీ చేస్తే కీళ్లకు కదలికలు సమకూరి వాటి ఆరోగ్యం మెరుగుపడటం, పోషకాలు అందడం జరుగుతాయి. ఇవే పనులు గుండెజబ్బుల ముప్పునూ తప్పిస్తాయి. అంటే ఒకే పనితో ఎన్నో ప్రమోజనాలుంటాయి.ఉదా: క్రమం తప్పని వ్యాయామం వల్ల గుండె బలంగా అవుతుంది. (కీళ్లు కూడా) అంతేకాదు... పది లక్షల సార్లు గుండె కొట్టుకుంటే కలిగే శ్రమను ఒక్కసారి చేసే వ్యాయామం దూరం చేస్తుంది. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ ప్రక్రియ మెరుగవుతుంది. శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ఎముకలు బలంగా మారతాయి. ఒత్తిడీ, నిద్రలేమి వంటివీ తగ్గుతాయి. చాలామంది పురుషులు ΄పోగతాగడం, మద్యంతాగడం తమ జన్మహక్కుగా భావిస్తారు. పైగా కొద్దిపాటి మద్యం గుండెకు మేలు చేస్తుందని సమర్థించుకుంటారు. కానీ... ΄పోగ, మద్యం ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు పరచడానికి కొత్త సంవత్సరాన్ని ఒక సందర్భంగా తీసుకుంటారు. మీ నిర్ణయం ఏదైనా... అంటే వ్యాయామం చేయడం, బరువు తగ్గడం, ΄పోగ, మద్యం వంటి అలవాట్లు మానేయడం... ఇవన్నీ వాయిదా వేయకండి. ఇప్పుడే ఈ కొత్త సంవత్సరంలో మొదలుపెట్టండి. -డాక్టర్ గాయత్రి కామినేని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్, కామినేని హాస్పిటల్స్డబ్బు జబ్బుకు ‘బీమా’త్రలుగత కొన్నేళ్లుగా పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా క్యాన్సర్లు అలాగే లైఫ్స్టెల్ డిసీజెస్ అని పిలిచే హైపర్టెన్షన్, డయాబెటిస్ వంటివి విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. జబ్బు వచ్చాక చికిత్స ఎలాగూ తప్పదు. ఇప్పుడు వీటి చికిత్సల గురించి ఆలోచించడం కంటే అసలివి రాకుండా ఉండేలా నివారణ చర్యలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇదో మంచి సమయం. ప్రస్తుత కాలం చాలా అనిశ్చితంగా ఉంది. మన ఆర్థిక పరిస్థితుల్లోగానీ రోజువారీ కార్యక్రమాల్లోగానీ ఎలాంటి మార్పులు వస్తాయో తెలియని అనిశ్చితి. అందుకే మున్ముందు మనందరి ఆరోగ్యాల రక్షణ కోసం, చికిత్సల కోసం మెడికల్ ఇన్సూ్యరెన్స్ను సిఫార్సు చేస్తున్నాను. మీతో పాటు మీ కుటుంబమంతటికీ ఇన్సూ్యరెన్స్ వచ్చేలా పాలసీ తీసుకోండి. క్యాన్సర్లు వస్తే అయ్యే ఖర్చులకు బెంబేలెత్తడం కంటే అవి రాకుండా నివారించడానికి అనుసరించాల్సిన మార్గాలు చాలా సులువైనవి. సమాజంలోని అందరూ... ముఖ్యంగా నలభై దాటిన ప్రతివారూ తరచూ ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అయితే ప్రస్తుతం సాంకేతిక మార్పులతో అందుబాటులోకి వచ్చిన చికిత్సలకు అయ్యే ఖర్చు తడిసిమోపెడు కానుంది. ఆ ఖర్చులు తట్టుకోవాలంటే ఇన్సూ్యరెన్స్ ఒక మార్గం. వాటితో పాటు మన జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తూ నివారించుకోవడం మరో మార్గం. ఈ రెండు మార్గాలను ఎంచుకుని మనల్ని మనం అటు ఆరోగ్యపరంగా, ఇటు ఆర్థికంగా కాపాడుకోవడం మన చేతుల్లో ఉన్న పని. - డాక్టర్ బి. కిశోర్రెడ్డి ఎండీ అమోర్ హాస్పిటల్స్, అండ్ చీఫ్ ఆర్థో ఆంకాలజిస్ట్ అమోర్ హాస్పిటల్ఆరోగ్యానికి బోన్.. మెయిన్ఒక భవనం పడిపోకుండా స్థిరంగా ఉండాలన్నా, ఈ దేహం ఒంగిపోకుండా నిటారుగా నిలబడాలన్నా... చిత్రంగా ఈ రెంటికీ అవసరమైనది క్యాల్షియమ్. దాదాపు 30 ఏళ్ల వయసులో ఇది గరిష్టంగా ఉండి, ఆ తర్వాత అనేక అంశాల కారణంగా ఇది కొద్దికొద్దిగా తగ్గుతూ పోతుంటుంది. అయితే దాన్ని మరింత కాలం నిలుపుకుంటూ దేహపు ఫ్రేమ్ వర్క్ అయిన ఎముకల సాంద్రతను (బోన్ డెన్సిటీని) గరిష్టకాలం పాటు నిలుపుకోవాలంటే చేయాల్సింది చాలా సులువైన పనులే. మంచి సమతులాహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడం. ఎముకల ఆరోగ్యాన్నీ, సాంద్రతనూ నిలుపుకోవడానికి తీసుకునే ఆహారంలోనూ రుచికరమైనవే ఎక్కువ. ఉదాహరణకు పాలు, వెన్న లాంటి డెయిరీ ఫుడ్స్; చిక్కుళ్లు, బెండకాయ, క్యాబేజీ, బ్రాకలీ లాంటి రుచికరమైన కూరగాయలు; టేస్టీగా ఉండే అంజీర్ లాంటి ఎండుఫలాలు, జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్తో పాటు చాలామంది టేస్టీగా ఫీలై తినే చేపలు. ఇవి ఎముకలతో పాటు మొత్తం దేహ సంపూర్ణ ఆరోగ్యాన్నీ కాపాడతాయి. అయితే వ్యాయామాలు లేకుండా కేవలం ఆహారాలు మాత్రమే ఎముకల సాంద్రత పెంచలేవు. అందుకే... నడక వంటి తమకు అనువైన వ్యాయామాలతో పాటు శ్రమ ఎక్కువగా చేయలేనివారు నడకతో పాటు ఇతరులు సైక్లింగ్, జాగింగ్, ఈత, తమకు ఇష్టమైన స్పోర్ట్స్ ఆడటం వంటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు చేస్తుంటే ఎముకలలోని క్యాల్షియమ్ చాలాకాలం పదిలంగా ఉంటుంది. -డాక్టర్ సుధీర్రెడ్డి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్మార్క్ హాస్పిటల్ -
డాక్టర్. నాగేశ్వర్ రెడ్డి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
డాక్టర్ నాగేశ్వర్రెడ్డికి అంతర్జాతీయ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ (ఆస్) 2020 సంవత్సరానికి ప్రకటించిన ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రవేత్తల జాబితాలో ఆయనకు చోటు లభించింది. గత 50 ఏళ్లలో ఒక భారతీయ డాక్టర్కు ఆస్ ఫెలోషిప్ దక్కడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఆయన చేసిన అనేక నూతన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ‘ఆస్’ తెలిపింది. క్లోమగ్రంధి సంబంధిత వ్యాధులను నయం చేసేందుకు ఆయన ఆవిష్కరించిన ‘నాగీ స్టంట్’ ప్రపంచ గుర్తింపు పొందింది. కాలేయం, క్లోమగ్రంధి వ్యాధులకు సంబంధించి పలు పరిశోధనలు చేశారు. కొత్త చికిత్సలకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన జరిగే ఆస్ వార్షిక సమావేశంలో ఫెలోషిప్ గ్రహీతలకు పురస్కారం అందజేస్తారు. అధికారిక ధ్రువీకరణ పత్రాలు, బంగారు, నీలం రంగుల్లో మెడల్స్ ప్రదానం చేస్తారు. 1878లో ప్రముఖ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్, 1905లో సామాజిక శాస్త్రవేత్త డబ్లు్యఈబీ డు బోయిస్, 1963లో కంప్యూటర్ శాస్త్రవేత్త గ్రేస్ హోపర్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలకు ఈ గుర్తింపు లభించింది. గత నెలలో నోబెల్ పొందిన ఇద్దరు శాస్త్రవేత్తలు జెన్నిఫర్ డౌడ్నా, చార్లెస్ రైస్లూ ఈ ఫెలోషిప్కు ఎంపికయ్యారు. -
'వైరస్ మారినా వ్యాక్సిన్ పనిచేస్తుంది'
సాక్షి, హైదరాబాద్: ‘మన దేశంలో కరోనా ముమ్మరమయ్యే నాటికి వైరస్ గురించి మనకు తెలిసిన విషయాలకంటే ఇప్పుడు మరింత సమాచారం తెలిసి వచ్చింది. ఈ కొత్త పరిజ్ఞానంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో, చికిత్స ప్రక్రియల్లో ఎన్నో మార్పులొచ్చాయి’ అంటున్నారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధినేత, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వచ్చే కోవిడ్–19 వ్యాధి ఏమాత్రం ఆందోళనపడదగినది కాదని చెబుతున్నారాయన. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇంకా ఏమన్నారంటే.. వైరస్ మారినా వ్యాక్సిన్ పనిచేస్తుంది దేశంలో కరోనా ప్రవేశించిన జనవరి నాటికీ, ఇప్పటికీ వైరస్లో చాలా మార్పులొచ్చాయి. దాదాపు 200కుపైగా మ్యుటేషన్స్ జరిగాయి. ఇప్పుడు డీ614జీ అనే మ్యుటేషన్తో ‘ఏ2ఏ టైప్’ వైరస్ దేశంలో విస్తరిస్తోంది. దీని వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రత గతంలో కంటే తక్కువనే భావిస్తున్నారు. ఇప్పటివరకు వైరస్లో ఎన్ని మార్పులొచ్చినా.. ‘రిసెప్టార్ బైండింగ్ ఏరియా’లో మ్యుటేషన్లేవీ రాలేదు. కాబట్టి ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్లో ఉన్న వ్యాక్సిన్లన్నీ ప్రభావవంతంగానే పనిచేస్తాయి. కాబట్టి వ్యాక్సిన్పై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే, వ్యాక్సిన్ పనిచేసినా, దాని ప్రభావం శరీరంలో ఎంతకాలం ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. ఇప్పటికి 3 నెలలు మాత్రం ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు గమనించారు. అయితే, ఏడాది పాటు ఉండొచ్చనీ, వ్యాక్సిన్ ప్రతి ఏడాదీ తీసుకోవాల్సి రావచ్చన్నది ప్రాథమిక అంచనా. డిసెంబర్ లేదా జనవరి నాటికి టీకా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 25 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. వీటిలోనూ ఆరు వ్యాక్సిన్లు మూడో దశ పరీక్షల్లోనూ, 19 వ్యాక్సిన్లు ఒకటీ/రెండో దశల్లో ఉన్నాయి. మన దేశంలో మూడు వ్యాక్సిన్లు ప్రస్తుతం రెండోదశ పరీక్షల్లో ఉన్నాయి. ఇక మోడెర్నా, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు మూడో దశలో విజయవంతంగా తమ ప్రభావాన్ని నిరూపించుకుంటున్నాయి. డిసెంబరు లేదా జనవరి తొలివారం నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు. ఇక రష్యా వ్యాక్సిన్ విషయానికొస్తే.. సాధారణంగా వ్యాక్సిన్ తయారీ తర్వాత దాన్ని మూడు దశల్లో పరీక్షించాలి. రష్యన్ వ్యాక్సిన్ను రెండోదశ పరీక్షల తర్వాత, వెంటనే కమర్షియల్ తయారీకి ఉపక్రమించారు. ఒక వ్యాక్సిన్ రోగులకు ఎంత సురక్షితమో నిర్ణయించేందుకు రెండు దశల పరీక్షలు సరిపోవు. కాబట్టి మళ్లీ వాళ్లు మూడో దశ ప్రయోగాలకు దిగారు. రీ–ఇన్ఫెక్షన్తో ప్రమాదం లేదు హాంగ్కాంగ్లో రెండోసారి ఇలా రీ–ఇన్ఫెక్షన్ వస్తోందంటున్నారు. తెలంగాణలోనూ ఒకటి రెండు కేసులొచ్చాయి. ఇక్కడ గమనించాల్సింది.. మొదటిసారి కరోనా వైరస్ సోకడం వల్ల కోవిడ్–19 అనే వ్యాధి వస్తుంది. కానీ రెండోసారి వైరస్ సోకినప్పటికీ కోవిడ్గానీ లేదా ఇతరత్రా ఎలాంటి వ్యాధీ రాదు. రెండోసారి వైరస్ సోకడం వల్ల కోవిడ్ వస్తుందన్నది అపోహే. వైరస్ వ్యాప్తి: నాడు – నేడు గతంలో నోటి నుంచి వచ్చే తుంపర్లు వస్తువులపై పడటం, వాటిని ముట్టుకున్న చేతులతో ముక్కు, నోరు, కళ్లకు తాకితే వైరస్ సోకుతుందని అనుకునేవాళ్లం. దీన్నే ‘డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్’ అంటారు. అయితే, దీనికంటే ‘ఏరోసాల్ ట్రాన్స్మిషన్’ వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువని తాజాగా తేలింది. అంటే తుంపర్ల కంటే మనుషులు మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి వెలువడే గాలికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం వల్లనే వైరస్ వ్యాప్తి ఎక్కువన్న మాట. గతంలో శానిటైజర్తో తరచూ చేతులు కడుక్కోవడానికి ప్రాధాన్యమిచ్చాం. కానీ, ఇప్పుడు మాస్క్ పెట్టుకోవడమే కరోనా కట్టడికి మేలైన మార్గం. మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి వెలువడే గాలి తుంపర్లు సోకకుండా ఉండటానికి భౌతికదూరం తప్పక పాటించాలి. భౌతికదూరం అనేది లాక్డౌన్ అంతటి ప్రభావం చూపుతుంది. మాస్క్ పెట్టుకుని అవతలి వ్యక్తికి కనీసం 6 నుంచి 9 అడుగుల దూరంలో ఉండాలి. ఇప్పుడు ఇన్డోర్స్ కంటే ఔట్డోర్స్లోనే ఏరోసాల్ ట్రాన్స్మిషన్కు అవకాశం తక్కువ. కాబట్టి బయటకు వెళ్తే భౌతికదూరం పాటిస్తూ సురక్షితంగా పనిచేసుకోవచ్చు. ఇక, ఏరోసాల్ ట్రాన్స్మిషన్ వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువంటున్నారు కాబట్టి గాలి ద్వారా వ్యాపిస్తుందా అంటే ‘లేద’నే చెప్పాలి. అంటే ఓ వ్యక్తి సమీపంలో ఉండి మాట్లాడుతుంటేనే ఆ గాలి ద్వారా వ్యాపించే అవకాశమెక్కువ. అంతేకానీ, ఎవరూ లేనిచోట వైరస్ గాలిలో ఉండటం, మనం అక్కడికి వెళ్లినప్పుడు సోకడం జరగదు. ఇక, ఏసీ ఇన్డోర్స్ విషయానికొస్తే.. లామినార్ ఫ్లో ఉండే ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం ఉన్నచోట వైరస్ వ్యాప్తి జరగదు. ఈ ఏసీలో తాజా గాలి పై నుంచి వస్తూ, కలుషిత గాలులు కిందికి వెళ్తుంటాయి. అందుకే ఇప్పుడు హాస్పిటల్స్ యాజమాన్యాలు లామినార్ ఫ్లో ఏసీ సౌకర్యాలను కల్పించుకుంటున్నాయి. శరీరంలో వైరస్ ప్రభావం..పరీక్షలు గతంలో వైరస్ గొంతు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందని అనుకునేవాళ్లం. ఇప్పుడది నోరు, ముక్కు ద్వారా ప్రవేశించాక నేరుగా రక్తప్రవాహంలోకి వెళ్లి.. అక్కడ రక్తనాళాల గోడలకు అంటుకుని వాటిని దెబ్బతీస్తుంది. వైరస్ ప్రవేశించిన మొదటి వారం అది రక్తంలోకి ప్రవేశించడాన్ని ‘వైరీమియా’ అంటారు. ఈ దశలోనే రెమ్డిస్విర్, ఫావీపిరావిర్ (ఫాబి ఫ్లూ) వంటి యాంటీవైరల్ మందులివ్వాలి. ఇక రెండోవారం అది ఊపిరితిత్తులపై దాడిచేస్తుంది. ఆ సమయంలో దేహంలో సైటోకైన్స్ విరివిగా తయారై.. వైరస్ను ఎదుర్కొనే క్రమంలో ఇవి మన దేహభాగాలనే దెబ్బతీస్తాయి. ఈ ప్రమాదాన్ని నివారించడానికి రెండో వారంలో డెక్సామిథోజోన్ వంటి స్టెరాయిడ్స్ ఇవ్వాలి. గతంలో దీనికి భిన్నంగా రివర్స్లో ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త ప్రొటోకాల్ ప్రకారం తగిన మందులిస్తూ మరణాలను చాలా వరకు తగ్గించగలిగాం. ఇక, ‘ఐఎన్6’, ఫెరిటిన్, ఎల్డీహెచ్, సీఆర్పీ, డీడైమర్ అనే పరీక్షల ద్వారా సైటోకైన్ కణాల విజృంభణ, సైటోకైన్ స్టార్మ్ తీవ్రతను అంచనా వేయవచ్చు. డీడైమర్ అనే పరీక్ష ద్వారా రక్తంలో గడ్డలు (బ్లడ్క్లాటింగ్) ఎక్కువగా ఉందా అనేది తెలుస్తుంది. గతంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ముక్కు నుంచి శాంపుల్స్ (నేసల్ శ్వాబ్) తీసుకునేవారు. ఇప్పుడు ఉమ్ము టెస్ట్ చేసినా తెలిసిపోతుంది. కరోనా.. కొత్త చికిత్సలు కరోనా చికిత్సలో వెంటిలేటర్ కంటే ‘హై ఫ్లో నేజల్ ఆక్సిజన్’ చికిత్స మంచి ఫలితాలనిస్తోంది. ముక్కు ద్వారా చాలా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ పంపడమనే ఈ చికిత్సలో సత్ఫలితాలు రాబడుతున్నాం. ఇక, ప్లాస్మా థెరపీ విషయానికొస్తే.. కన్వలసెంట్ ప్లాస్మాథెరపీలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఎక్కువుంటేనే ఈ చికిత్స ప్రభావం చూపుతుందని తేలింది. ఈ చికిత్సను సైతం వ్యాధి సోకిన తొలివారంలో అందించాలి. తాజాగా ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్’ చికిత్స అందుబాటులోకి వచ్చింది. మనకు రోగనిరోధకతనిచ్చే యాంటీబాడీన్ మన దేహంలో ‘బీ సెల్స్’ అనే కణాల్లో తయారవుతాయి. వీటిని తీసుకుని, వాటి నుంచి పెద్దసంఖ్యలో యాంటీబాడీస్ తయారుచేసి, ఎక్కించడమే ఈ చికిత్స విధానం. ఇది కూడా మంచి ప్రభావమే చూపుతోందని తేలింది. యాంటీబాడీస్ పెరిగితే వ్యాక్సిన్తో పనిలేదు.. మనం చేస్తున్న పరీక్షల్లో 10 శాతం మందికే పాజిటివ్ వస్తోంది. మరణాలు ఒక శాతం కంటే కూడా తక్కువే. అయితే స్థూలకాయం ఉన్నవారికి ప్రమాదకరమే. కాబట్టి ఫిట్నెస్ కాపాడుకోవాలి. పరీక్షల సందర్భంలో మన సమాజంలో 25% మందిలో యాంటీబాడీస్ ఉన్నట్టు తేలింది. కొద్దిరోజుల్లో ఇది 60శాతానికి చేరితే, అప్పుడిక వ్యాక్సిన్ అవసరం కూడా ఉండకపోవచ్చు. అప్పటివరకు అందరూ మంచి పోషకాలతో ప్రోటీన్లు ఎక్కువుండే ఆహారం తీసుకోవాలి. రోజూ విటమిన్–సీ 500 మి.గ్రా.; విటమిన్ బీతో పాటు 60 మి.గ్రా. జింక్ ఉండే మాత్రలు తీసుకోవాలి. ఒకసారి 60,000 యూనిట్లు అందేలా వారానికోసారి విటమిన్–డీ టాబ్లెట్స్ తీసుకుంటూ రోజూ ఉదయం, సాయంత్రం ఆవిరి పడుతుండాలి. పల్స్ ఆక్సిమీటర్తో చెక్ చేసుకుంటూ, దాని విలువ 95కంటే తక్కువుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. చివరిగా అందరికీ చెప్పేదొక్కటే.. ‘ఆందోళన పడకండి.. అప్రమత్తంగా ఉండండి’. రీ–ఇన్ఫెక్షన్తో ప్రమాదం లేదు హాంకాంగ్లో రెండోసారి రీ–ఇన్ఫెక్షన్ వస్తోందంటున్నారు. తెలంగాణలోనూ ఒకటి రెండు కేసులువచ్చాయి. ఇక్కడ గమనించాల్సింది.. మొదటిసారి కరోనా వైరస్ సోకడం వల్ల కోవిడ్–19 అనే వ్యాధి వస్తుంది. కానీ రెండోసారి వైరస్ సోకినప్పటికీ కోవిడ్గానీ లేదా ఇతరత్రా ఎలాంటి వ్యాధీ రాదు. రెండోసారి వైరస్ సోకడం వల్ల కోవిడ్ వస్తుందన్నది అపోహే. -
రెండు వారాల లాక్డౌన్ మరింత ముఖ్యమైనది
-
‘దుబ్బాకలో రామలింగా రెడ్డి ఓటమి ఖాయం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం గోరి కట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం టీఆర్ఎస్ నేత నాగేశ్వర్ రెడ్డి.. ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో రామలింగా రెడ్డి ఓటమి ఖాయమనిపిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు కన్న కళ చెదిరిపోయిందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ను బొంద పెట్టాలని విమర్శించారు. కొద్ది రోజుల క్రితం తాను ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లగా అక్కడి విద్యార్ధుల్లో కేసీఆర్ను తిట్టని వారు లేరని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఆపలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డనాటికి ఉన్న ఉద్యోగాల ఖాళీలను ఈ రోజు వరకు ప్రభుత్వం భర్తీ చేయలేదని తెలిపారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని ఆయన అభిప్రాయపడ్డారు. -
’ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ విడుదల
-
డాక్టర్ నాగేశ్వర్రెడ్డికి ఐఎంఏ జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డికి ‘ఐఎంఏ డాక్టర్ ఎంజీ గార్గ్ జీవిత సాఫల్య పురస్కారం’లభించింది. ముంబైలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పురస్కార ప్రదాన కార్యక్రమానికి వెయ్యిమంది ప్రసిద్ధ వైద్యులు హాజరయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యరంగంలో ఆయన చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు ఐఎంఏ తెలిపింది. -
విషం తాగిన విద్యార్థుల్లో ఇద్దరు మృతి
అనంతపురం : చదువుకోవడం ఇష్టం లేక అనంతపురం జిల్లాలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజమునీశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ లు చనిపోయారు. మరో విద్యార్ధి చంద్రశేఖర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యాడికి మండలం పుప్పాల యంగన్నపల్లికి చెందిన ముగ్గురు విద్యార్థులు బుధవారం విషపు గుళికలు తిని ఆత్మహత్యకు యత్నించారు. వీరు స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. గత కొంతకాలంగా చదువు అంటే ఇష్టం లేదని, స్కూల్ కి వెళ్లమని కుటుండసభ్యులకు చెప్పేవారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్కూల్ కు వెళ్లి అక్కడి నుంచి గ్రామ సమీపంలోని కొండ వద్దకు చేరుకుని అక్కడ విషపు గుళికలను కూల్ డ్రింక్ లో కలుపుకుని తాగారు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు గమనించి పెద్దవడుగూరు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. అయినా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరు లోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఇద్దరు విద్యార్థులు మరణించారు. (యాడికి) -
స్కూల్కు వెళ్లాల్సి వస్తుందని.. ఆత్మహత్యాయత్నం
యాడికి (అనంతపురం): రోజూ స్కూల్కు వెళ్లాల్సి వస్తుందని విషపు గుళికలు మింగి ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం వెంగన్నపల్లి గ్రామ శివారులో ఉన్న కొండమీద బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి అనే ముగ్గురు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే ఇష్లం లేని ఆ ముగ్గురూ కలిసి విషపు గుళికలను పొడిగా చేసుకుని నీళ్లలో కలుపుకుని తాగారు. వారి పరిస్థితి విషమంగా ఉండటం గమనించిన స్థానికులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి లతో పాటు హైకోర్టు న్యాయమూర్తి నాగేశ్వర రెడ్డి లు ఉన్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వారు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.