ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదంటూ పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలోని బయో ఇథనాల్ ఫ్యాక్టరీలో కార్మికులు ఆందోళనకు దిగారు.
ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదంటూ పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలోని బయో ఇథనాల్ ఫ్యాక్టరీలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఎన్నో వినతుల మేరకు మార్చి 5వ తేదీన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారని, పది రోజులైనా ఆ ఊసు ఎత్తటం లేదని 150 మంది కార్మికులు విధులు బహిష్కరించారు. ఇద్దరు కార్మికులు అక్కడే ఉన్న నీళ్ల ట్యాంకుపైకి ఎక్కారు. వెంటనే వేతనాలివ్వకుంటే దూకి చస్తామని బెదిరించారు. ఆందోళన కొనసాగుతోంది.