రైలు కింద పడి యువతి ఆత్మహత్య | The woman who fell under the train suicide | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి యువతి ఆత్మహత్య

Jun 26 2014 2:49 AM | Updated on Nov 6 2018 7:53 PM

రైలు కింద పడి యువతి ఆత్మహత్య - Sakshi

రైలు కింద పడి యువతి ఆత్మహత్య

పట్టణంలోని గాంధీనగర్ రైల్వే గేట్ వద్ద బుధవారం స్థానిక ఇందిరానగర్‌కు చెందిన నారాయణమ్మ(19) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. బాధితుల కథనం మేరకు..

మూర్చవ్యాధి నయం కాకపోవడంతో మనస్తాపం చెంది బలవన్మరణం
 ధర్మవరం టౌన్ : పట్టణంలోని గాంధీనగర్ రైల్వే గేట్ వద్ద బుధవారం స్థానిక ఇందిరానగర్‌కు చెందిన నారాయణమ్మ(19) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. భవన నిర్మాణ కార్మికులైన యల్లమ్మ, ఓబిలేషు దంపతుల కుమార్తె నారాయణమ్మకు చిన్ననాటి నుంచే మూర్చవ్యాధితో బాధపడుతుండేది. పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి చికిత్స చేస్తున్నా ఫలితం లేకపోయింది.
 
 ఈ వ్యాధి కారణంగా పెళ్లి సంబంధాలు కూడా కుదరడం లేదు. దీంతో ఇక తనకు ఈ వ్యాధి నయం కాదని నారాయణమ్మ తరచూ మదనపడుతుండేదని తల్లిదండ్రులు వాపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బహిర్భూమికి ఆమె రైలు కింద పడి బలవన్మరణం పాలైంది. స్థానికులు గుర్తించి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు కలచి వేసింది. రైల్వే ట్రాక్ మధ్యలో పడి ఉన్న సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement