నవదంపతులు గల్లంతు | The newly married couple 's flood washed | Sakshi
Sakshi News home page

నవదంపతులు గల్లంతు

Nov 23 2015 7:49 PM | Updated on Aug 1 2018 3:59 PM

పీలేరు మండలం నాలేవాండ్లపల్లి వద్ద కాజ్‌వే దాటుతుండగా వరద నీటిలో నవదంపతులు గల్లంతయ్యారు.

పీలేరు మండలం నాలేవాండ్లపల్లి వద్ద కాజ్‌వే దాటుతుండగా వరద నీటిలో నవదంపతులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు సదుం మండలం తిమ్మానాయుని పల్లె గ్రామానికి చెందిన సురేష్(26), గీత(18)గా గుర్తించారు. సురేష్ ఆర్మీ ఉద్యోగి. నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. పీలేరులోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చేపట్టారు. భారీగా వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు అంతరాయమేర్పడింది.



 

Advertisement
 
Advertisement
Advertisement