రణస్థలం/లావేరు: రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా రణస్థలం, లావేరు మండలాల్లో అధికారులు చేపట్టిన తోటపల్లి కాలువ తవ్వకాలను గురువారం అడ్డుకున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పక్వానికి వచ్చే పంటల్లో కాలువల తవ్వకంపై మండిపడ్డారు. రణస్థలం మండలంలోని రణస్థలం రెవెన్యూ, లావేరు మండలంలోని తాళ్లవలస రెవెన్యూ పరిధిల్లో పొక్లెయిన్లతో చేపట్టిన తవ్వకాలను రణస్థలం, రావివలస రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న లావేరు మండల తహశీల్దార్ పి.వేణుగోపాలరావు, ఎస్సై రామారావులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
శివారు భూములకు సాగునీరందించేందుకు చేపట్టే కాలువ తవ్వకాలకు సహకరించాలని కోరారు. దీనిపై పలువురు రైతులు మాట్లాడుతూ పంటలు పక్వానికి వచ్చే దశలో ఉన్నాయని, ఇప్పుడు వాటిని నాశనం చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. భూము లు ఏ మేరకు పోతున్నాయి, ఎంత నష్టపరిహారం అందజేస్తారన్నది తెలియజేయకుండా పనులు చేపట్టడాన్ని తప్పుబట్టారు. స్థానికంగా భూములు లేని టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన తప్పుడు నివేదికల ఆధారంగా పనులకు పూనుకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.అధికారులు నచ్చజెప్పినా రైతులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగారు. పక్కా సర్వే, పరి హారం లెక్క తేలాకే పనులు చేపట్టాలని రణస్థలం, తాళ్లవలస గ్రామాలకు చెందిన రైతులు పిన్నింటి అప్పలనాయడు, సత్యం, పి.పాపినాయుడు, కుప్పిలి అప్పారావు, నీలకంఠం, లక్ష్మణరావు తదితరులు కోరారు.
ఎకరాభూమి నష్టపోతున్నా...
రావివలస గ్రామంలో ఉన్న ఎకరా భూమి తోటపల్లి కాలువకు పోతోంది. ఇక్కడ భూమిని సాగుచేయడానికి బోరుకూడా వేశాను. ఇప్పుడు ఎకరాభూమితో పాటు బోరుకూడా నష్టపోతున్నాను. ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేస్తుందో తెలియజేసి కాలువల తవ్వకాలు జరపాలి -పిన్నింటి సత్యనారాయణ, రైతు, రణస్థలం పంట చేతికొచ్చే సమయంలో...కాలువకు 40 సెంట్లు భూమి పోతోంది. ఇందులో ప్రస్తుతం మొక్కజొన్న సాగుచేస్తున్నా. పక్వానికి వచ్చింది. ఈ సమయంలో కాలువ తవ్వితే పెట్టుబడి అంతా మట్టిలో కలిసిపోతుంది. పరిహారం ఇచ్చాకే పనులు జరపాలి -పిన్నింటి అప్పలనాయుడు, రైతు, రణస్థలం
తోటపల్లి కాలువ పనులను అడ్డుకున్న రైతులు
Published Fri, Feb 5 2016 12:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement