కర్నూలు(రాజ్విహార్), న్యూస్లైన్: రోడ్డు రవాణా సంస్థలో మహిళా కండక్టర్లు అసౌకర్యాల నడుమ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రయాణించడం.. కిటకిటలాడే బస్సుల్లో టికెట్లు ఇవ్వడం, ప్రయాణికులను సరి చూసుకోవడం, స్టేజీ వచ్చేలోపు స్టాటస్టికల్ రిపోర్టు (ఎస్ఆర్) రాయడం లాంటివి పురుషులతో సమానంగా చేస్తున్నా ఉద్యోగినిల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సంస్థ మహిళలకు 33శాతం రిజర్వేషన్ సౌకర్యం వర్తింపజేయడంతో కండక్టర్ పోస్టుల్లో చేరిన మహిళలకు సమస్యలు నిరంతరం వెన్నాడుతూనే ఉన్నాయి. అధికారుల అలసత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం వెరసి విధులంటేనే విసుగెత్తిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 970 బస్సులున్నాయి. వీటిలో విధులు నిర్వహించేందుకు 1970 మంది కండక్టర్లు ఉండగా అందులో 272 మంది మహిళా కండక్టర్లున్నారు. ప్రతి డిపోలో 20 నుంచి 30 మంది వరకు ఉన్నారు.
అంతటా అసౌకర్యాలే: మహిళా కండక్టర్లకు ప్రత్యేక సౌకర్యాలు, సెలవులు, వసతులు కల్పించాల్సి ఉంది. సమస్యలు పరిష్కరించాలని నోరు తెరిచి అడిగితే పైఅధికారుల ఆగ్రహానికి గురికావాల్సిందే.
డిపోలో విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినా మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. నిర్వాహణ సరిగా లేకపోవడంతో వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మహిళా కండక్టర్లు ఇష్టపడడం లేదు.
డ్యూటీ టర్మినల్ పాయింట్లలో తాగునీరు, మూత్రశాలల వసుతులు కల్పించాల్సి ఉంది. ఈసౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మౌనం వహిస్తున్నారు.
ప్రత్యేక సెలవులుగా నెలకు 3 రోజులు అదనంగా క్యాజువల్ లీవ్లు ఇవ్వాల్సి ఉంది. కాని సెలవులు ఇవ్వాలంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళా కండక్టర్లు వాపోతున్నారు.
నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి రాత్రి 9గంటల లోపే పూర్తయ్యే డ్యూటీలు వేయాలి. కాని రాత్రి 11గంటల ఉండే విధులప్పగిస్తున్నారు.
అందరికీ చార్ట్ (రెగ్యూలర్గా తిరిగే సర్వీసులు) డ్యూటీలు వేయడం లేదు. ఫలితంగా కొందరు ఈ రోజుకు ఏ సర్వీసు వేశారో అని చూసుకుంటే మరి కొందరు మాత్రం డ్యూటీలు లేక ఇంటికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి.
అధికారుల ఒత్తిళ్లు, వేధింపులు ఉండనే ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం సాధారణమైంది. ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో డ్యూటీలు వేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
మెరున్ రెడ్ శారీ (చీరలు) డ్రస్ కోడ్గా ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. బూట్లు కూడా ముఖ్యంగా చిల్లర సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నిబంధనల ప్రకారం విధులకు హాజరయ్యే ముందు కండక్టర్లకు రూ.50ల చిల్లర ఇవ్వాల్సి ఉంది. కాని సరిగా ఇవ్వకపోవడం, ప్రయాణికులు వంద, ఐదు వందల రూపాయల నోట్లు ఇవ్వడం సమస్యకు దారి తీస్తోంది.
కష్టాల ప్రయాణం
Published Mon, Feb 10 2014 3:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement