తెలంగాణ కవి, సాయుధ పోరాట యోధుడు, రావెళ్ల వెంకటరామారావు(86) మంగళవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలోని ఆయన స్వగృహంలో కన్ను మూశారు.
తెలంగాణ కవి, సాయుధ పోరాట యోధుడు, రావెళ్ల వెంకటరామారావు(86) మంగళవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలోని ఆయన స్వగృహంలో కన్ను మూశారు. 1929లో జన్మించిన ఈయన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడంతో పాటు తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. తెలంగాణ గేయాన్ని రాసిన మొదటి కవి రావెళ్ల. ఆయన భౌతికకాయాన్ని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సందర్శించి సంతాపం ప్రకటించారు.