తెలంగాణ కవి ‘రావెళ్ల’ కన్నుమూత | Telangana poet Ravella dies | Sakshi
Sakshi News home page

తెలంగాణ కవి ‘రావెళ్ల’ కన్నుమూత

Dec 11 2013 3:11 AM | Updated on Sep 2 2017 1:27 AM

తెలంగాణ కవి, సాయుధ పోరాట యోధుడు, రావెళ్ల వెంకటరామారావు(86) మంగళవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలోని ఆయన స్వగృహంలో కన్ను మూశారు.

తెలంగాణ కవి, సాయుధ పోరాట యోధుడు, రావెళ్ల వెంకటరామారావు(86) మంగళవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలోని ఆయన స్వగృహంలో కన్ను మూశారు. 1929లో జన్మించిన ఈయన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడంతో పాటు తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. తెలంగాణ గేయాన్ని రాసిన మొదటి కవి రావెళ్ల. ఆయన భౌతికకాయాన్ని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సందర్శించి సంతాపం ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement