మంత్రి రావెలకు అసమ్మతి సెగ | tdp leaders protests over minister ravela tour in prathipadu | Sakshi
Sakshi News home page

మంత్రి రావెలకు అసమ్మతి సెగ

Oct 21 2016 6:50 PM | Updated on Aug 29 2018 7:45 PM

మంత్రి రావెలకు అసమ్మతి సెగ - Sakshi

మంత్రి రావెలకు అసమ్మతి సెగ

ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబుకు తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి సెగ తగిలింది.

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుకు తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి సెగ తగిలింది. ప్రత్తిపాడులో మంత్రి రావెల శుక్రవారం పర్యటించారు.

వట్టి చెరుకూరు మండలం వింజనంపాడులో స్థానిక టీడీపీ నేతలు మంత్రిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement