మన్ననూర్, న్యూస్లైన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక నల్లమల అడవిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి పోలీసులకు వచ్చిన ఫోన్కాల్ కలకలం సృష్టించింది. పోలీసులను ఉరుకులు పరుగులు పె ట్టించి ముచ్చెమటలు పట్టించింది. పోలీ సులు, ఫారెస్ట్సిబ్బంది అడవిలో జల్లెడపట్టినా వారి ఆచూకీ లభించింది. చివరికి చిన్న క్లూ ద్వారా వారి పట్టుకోవడం కథ సుఖాంతమైంది. ఈ సంఘటన మన్ననూర్ అటవీశాఖ చెక్పోస్టు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. అమ్రాబాద్ ఎస్ఐ రవీందర్ కథనం మేరకు..
ఏం జరిగిందంటే..
‘హైదరాబాద్కు చెందిన మేము చెక్పోస్టు వద్ద కారు ఉంచి నా భార్య, నేను కుటుంబ సమస్యలు, అప్పులు, వ్యక్తిగత కారణాలతో బతుకుమీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి నల్లమల అడవిలోని వెళుతున్నాం..’ అంటూ ఓ అపరిచిత వ్యక్తి పోలీసులకు ఫోన్చేసి కట్ చేశాడు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆరాతీశారు. ఉదయం 6 గంటలకు అచ్చంపేట ఆర్టీసీ డిపో బస్సు ఎక్కి శ్రీశైలం వైపు వెళ్లారని స్థానిక హోటల్ నిర్వాహకులు తెలిపారు. వారు విడిచి వెళ్లినట్టు భావిస్తున్న (ఏపీ 09 బికె 4423) స్పార్క్ కారు డోర్లకు తాళం తీసి ఉండటంతో పోలీసులు తెరిచి చూశారు. అందులో వివిధ బ్యాంకులకు చెందిన సుమారు పది ఏటీఎం కార్డులు ఉన్నట్లు గుర్తించారు. వేర్వేరు పేర్లతో ఆర్సీ, డ్రైవింగ్ లెసైన్స్, కారు కాగితాలు, ల్యాప్టాప్ మరికొన్ని వస్తువులను కనుగొన్నారు. సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో ఫారెస్టు సిబ్బంది వెతికినా వారి ఆచూకీ మాత్రం లభించలేదు.
చిక్కారు ఇలా..
హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు, స్థానికులు కలిసి ఒకేఒక ఆధారంగా భావించి తమకు ఫోన్వచ్చిన సెల్: 9701277983 ద్వారా రంగంలోకి దిగారు. అదేవిధంగా డ్రైవింగ్ లెసైన్స్పై అనిల్కుమార్ తండ్రి గోపాలకృష్ణగౌడ్ ఏడ్చెర్ల నిజమాబాద్ జిల్లా, ఆర్సీ పేపర్పై తాటికొండ శ్రీనివాసాచారి తండ్రి సద్గురాచారి అని లభ్యమైన వివరాలు పోలీసులకు మరింత తోడయ్యాయి. దీంతో మొబైల్ ట్రాకర్ ద్వారా పై నెంబర్ నుంచి వచ్చిపోయే ఫోన్కాల్స్ను పసిగట్టారు. చివరికి వారిని శ్రీశైలం క్షేత్రంలోని నందిమండపం సర్కిల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు శ్రీనివాసాచారి(31), శ్రావణి(29)గా గుర్తించారు.
వారు గతకొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవాలని భావించి..నల్లమల అటవీప్రాంతానికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలిం ది. నేరుగా ఆర్టీసీ బస్సులో వచ్చిన వారు శుక్రవారం మధ్యాహ్నం పాతాళగంగలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా అక్కడ వీలుపడకపోవడంతో పలుప్రాంతాలు తిరిగారు. ఆ తరువాత శ్రీశైలం క్షేత్ర సమీపంలోని ఇష్టకామేశ్వరిని దర్శనం చేసుకున్నారు. రాత్రి పోలీసులు వారిని పట్టుకుని హైదరాబాద్కు తరలించడంతో కథ సుఖాం తమైంది. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
అడవిలో హల్చల్
Published Sat, Oct 19 2013 4:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement