ఆరోపించేవాళ్లే నిరూపించాలి: సుదీష్ | Sudhish rambhotla condemns bjp office in krishna karrakatta area | Sakshi
Sakshi News home page

ఆరోపించేవాళ్లే నిరూపించాలి: సుదీష్

Feb 2 2015 2:37 PM | Updated on Mar 29 2019 5:57 PM

ఆరోపించేవాళ్లే నిరూపించాలి: సుదీష్ - Sakshi

ఆరోపించేవాళ్లే నిరూపించాలి: సుదీష్

విజయవాడలో బీజేపీ కార్యాలయం కబ్జా భూమిలోనిది కాదని, ఆరోపణలు చేసినవారే నిరూపించాలని బీజేపీ నేత సుదీష్ రాంబొట్ల డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : విజయవాడలో బీజేపీ కార్యాలయం కబ్జా భూమిలోనిది కాదని, ఆరోపణలు చేసినవారే నిరూపించాలని బీజేపీ నేత సుదీష్ రాంబొట్ల డిమాండ్ చేశారు. అంతర్వేది ఆలయంలో అన్యమత ప్రచారం చేసినవాళ్లను కఠినంగా శిక్షించాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సహాయం విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని సుదీష్ రాంబొట్ల పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా కృష్ణా నదీ తీరంలో బీజేపీ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని చేపట్టిందంటూ సీపీఎం విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement