తాగిన మైకంలో తల్లి మరణానికి కారకుడయ్యాడు ఓ కిరాతక కొడుకు. మద్యం మత్తులో గుడిసెకు నిప్పంటించడంతో నిద్రిస్తున్న అతడి తల్లి వెంకటమ్మ సజీవ దహనమయింది.
వరంగల్: తాగిన మైకంలో తల్లి మరణానికి కారకుడయ్యాడు ఓ కిరాతక కొడుకు. మద్యం మత్తులో గుడిసెకు నిప్పంటించడంతో నిద్రిస్తున్న అతడి తల్లి వెంకటమ్మ సజీవ దహనమయింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం రంగరాయగూడెంలో చోటుచేసుకుంది.
నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తానేం చేస్తున్నాడో తెలియని మైకంలో అతడీ దారుణానికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు.