కాకినాడ - బెంగళూరు మధ్య నడిచే శేషాద్రి ఎక్స్ప్రెస్లోని ఎస్-7 కోచ్లో ఈ రోజు ఉదయం చిత్తూరు జిల్లాలో గుడిపాల మండలం రామాపురం వద్ద పొగలు వ్యాపించాయి.
కాకినాడ - బెంగళూరు మధ్య నడిచే శేషాద్రి ఎక్స్ప్రెస్లోని ఎస్-7 కోచ్లో ఈ రోజు ఉదయం చిత్తూరు జిల్లాలో గుడిపాల మండలం రామాపురం వద్ద పొగలు వ్యాపించాయి. దాంతో ఆ రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. దీంతో ప్రయాణికులు మరో బోగిల్లోకి పరుగులు తీశారు.
రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమైయ్యారు. కోచ్ ఎస్ -7లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని రైల్వే అధికారులు వెంటనే గుర్తించారు. అనంతరం ఎస్-7లో ఏర్పడిన లోపాన్ని అధికారులు సరి చేశారు. శేషాద్రి ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యంగా అక్కడి నుంచి బయలుదేరింది. దాంతో ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు.