శేషాద్రి ఎక్స్ప్రెస్లోని కోచ్ ఎస్ 7లో పొగలు | Smoke at S-7 coach in seshadri express train | Sakshi
Sakshi News home page

శేషాద్రి ఎక్స్ప్రెస్లోని కోచ్ ఎస్ 7లో పొగలు

Nov 5 2013 10:03 AM | Updated on Oct 22 2018 2:14 PM

కాకినాడ - బెంగళూరు మధ్య నడిచే శేషాద్రి ఎక్స్ప్రెస్లోని ఎస్-7 కోచ్లో ఈ రోజు ఉదయం చిత్తూరు జిల్లాలో గుడిపాల మండలం రామాపురం వద్ద పొగలు వ్యాపించాయి.

కాకినాడ - బెంగళూరు మధ్య నడిచే శేషాద్రి ఎక్స్ప్రెస్లోని ఎస్-7 కోచ్లో ఈ రోజు ఉదయం చిత్తూరు జిల్లాలో గుడిపాల మండలం రామాపురం వద్ద పొగలు వ్యాపించాయి. దాంతో ఆ రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. దీంతో ప్రయాణికులు మరో బోగిల్లోకి పరుగులు తీశారు.

 

రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమైయ్యారు. కోచ్ ఎస్ -7లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని రైల్వే అధికారులు వెంటనే గుర్తించారు. అనంతరం ఎస్-7లో ఏర్పడిన లోపాన్ని అధికారులు సరి చేశారు. శేషాద్రి ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యంగా అక్కడి నుంచి బయలుదేరింది. దాంతో ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement