ఆంధ్రప్రదేశ్లో నలుగురు ఐఏఎస్లకు స్థానచలనం కలిగింది. రాష్ట్రప్రభుత్వం ఈమేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లకు స్థానచలనం కలిగింది. రాష్ట్రప్రభుత్వం ఈమేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో గోపాల్ బదిలీ అయ్యారు. గోపాల్ స్థానంలో డి.సాంబశివరావు నియమితులయ్యారు.
మున్సిపల్ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎ. గిరిధర్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా అజయ్ జైన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా సునీతకు అదనపు బాధ్యతలు అప్పగించగా, గుల్జార్, ఎంజీ గోపాల్కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలనా శాఖను సంప్రదించాలని వారికి ఆదేశాలు అందాయి. కాగా గుల్జార్ ఇప్పటికే కేంద్ర సర్వీసులకు ఎంపిక అయ్యారు.