నగరంలో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సమావేశం ప్రారంభం | Seemandhra lawyers' joint action committee meeting starts at Ashok Gardens in Mehdipatnam | Sakshi
Sakshi News home page

నగరంలో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సమావేశం ప్రారంభం

Sep 28 2013 11:58 AM | Updated on Sep 1 2017 11:08 PM

సీమాంధ్రలోని న్యాయవాదుల జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశం శనివారం గుడిమల్కాపూర్లోని అశోక గార్డెన్స్లో ప్రారంభమైంది.

సీమాంధ్రలోని న్యాయవాదుల జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని  కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశం శనివారం  గుడిమల్కాపూర్లోని అశోక గార్డెన్స్లో ప్రారంభమైంది. ఆ సమావేశానికి సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

 

అయితే ఆ సదస్సును అడ్డుకునేందుకు తెలంగాణవాదులు యత్నించారు. ఆ క్రమంలో వారు అశోక గార్డెన్స్ సమీపంలోని వాటర్ట్యాంక్ ఎక్కి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement