breaking news
Gudimalkapur
-
గుడిమల్కాపూర్కు గుడ్బై!
సాక్షి, హైదరాబాద్: గత 34 ఏళ్లుగా నగరవాసులకు సేవలందిస్తున్నన గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ శివారుకు తరలనుంది. కూరగాయలు, పూల వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన ఈ మార్కెట్ను రెండు విభాగాలుగా విభజించాలని నిర్ణయించారు. ఈ మేరకు అజీజ్నగర్లో కూరగాయలు, పండ్లు, హిమాయత్సాగర్లో పూల మార్కెట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుత మార్కెట్ స్థలం తక్కువ, రద్దీ ప్రాంతంలో ఉండడం కారణంగా రైతులు, కమీషన్ ఏజెంట్లు, హోల్సేల్ వ్యాపారులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకుని మొయినాబాద్ మండలం అజీజ్నగర్ గ్రామంలోని సర్వే నం.176లో 23.2 ఎకరాల్లో కూరగాయల మార్కెట్, హిమాయత్సాగర్ గ్రామ సర్వే నం.151లో 19.10 ఎకరాల్లో పూల మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేపథ్యం ఇదీ.. 1991లో కార్వాన్ సబ్జీమండి గుడిమల్కాపూర్కు తరలింది. ఈ మార్కెట్ అప్పటి అవసరాలకు సరిపోయింది. కానీ నేడు నగరం 4 రెట్లు పెరిగింది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మార్కెట్కు రోజూ 2 వేలకు పైగా వాహనాలు వస్తాయి. పార్కింగ్, రహదారులు, పారిశుధ్యం వంటి సమస్యలున్నాయి. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ వంటి కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. రైతులు, కమీషన్ ఏజెంట్లు, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త ప్రణాళికకు రూపకల్పన చేసింది. శివారు జిల్లాల రైతులకు ప్రయోజనం కొత్తగా రానున్న అజీజ్నగర్, హిమాయత్సాగర్ మార్కెట్ల వల్ల నగరానికి ఆనుకుని ఉన్న వికారాబాద్, కొడంగల్, తాండూరు, పరిగి, చేవెళ్ల, మహబూబ్నగర్, నల్గొండ, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఓఆర్ఆరకు ఆనుకుని ఉండడం వల్ల రవాణా సమయం, వ్యయం తగ్గుతుంది. ఇక రాబోయే మార్కెట్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిరి్మస్తారు. కోల్డ్ స్టోరేజ్, విశాలమైన పార్కింగ్ స్థలం, సారి్టంగ్, ప్యాకింగ్ జోన్లు, ఆధునిక డ్రైనేజ్, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, రైతు సేవా కేంద్రం, బ్యాంకు, క్యాంటీన్న్, కమీష¯Œన్ ఏజెంట్లకు ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేస్తారు. -
Gudimalkapur: కింగ్స్ ప్యాలెస్లో కాల్పుల కలకలం
-
Hyd:గుడిమల్కాపూర్లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: గుడిమల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్పోలో కాల్పుల కలకలం రేగింది. ఎక్స్పోలో ఇద్దరు షాప్ యజమానుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిలో ఓ షాపు యజమాని గాలిలో కాల్పులు జరిపాడు. దీంతో ఎక్స్లో ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. -
స్పా సెంటర్లపై పోలీసులు దాడి..! ఐదుగురు యువతులు అరెస్ట్
హైదరాబాద్: మసాజ్ పేరుతో అక్రమంగా కొనసాగిస్తున్న స్పా కేంద్రాలపై గుడిమల్కాపూర్ పోలీసులు, సౌత్వెస్ట్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఐదుగురు మహిళలతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ షేక్ ముజీబ్ ఉర్ రెహా్మన్ తెలిపిన వివరాల ప్రకారం.. నానల్నగర్లోని ఓ ఆపార్ట్మెంట్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జన్నత్, గోల్డెన్ అనే రెండు స్పా కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు మహిళలతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు స్పా కేంద్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. స్పా, స్నూకర్, రిక్రియేషన్క్లబ్లకు ఇళ్లను అద్దెకిచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని ఇళ్ల నిర్వహకులకు ఇన్స్పెక్టర్ సూచించారు. -
గుడిమాల్కాపూర్లోని అక్రమ స్పాసెంటర్లపై పోలీసుల దాడులు
-
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు
-
గుడిమల్కాపూర్ కార్పొరేటర్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకుడు, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ (55) హఠాన్మరణం చెందారు. గురువారం రాత్రి ఇంట్లో మనవడితో ఆడుకుంటూ ఉల్లాసంగా ఉన్న కరుణాకర్ ఒక్కసారిగా కుర్చీలో నుంచి కిందపడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను అంబులెన్స్లో సిటీన్యూరో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించి చికిత్స అందించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతదేహాన్ని గుడిమల్కాపూర్లోని స్వగృహంలో ఉంచగా పార్టీ నేతలు, కార్యకర్తలు సందర్శించారు. కాగా కరుణాకర్ రెండు పర్యాయాలు కార్పొరేటర్గా, ఆయన భార్య దీప ఓ పర్యాయం కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. శాసనసభ ఎన్నికల్లో నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు బంధువే కాకుండా అత్యంత సన్నిహితుడు. కరుణాకర్కు భార్య దీప, కుమారుడు దేవర వంశీ ఉన్నారు. కాగా గత రెండేళ్ల క్రితం ఆయన ఏకైక కుమార్తె దేవర భవానీ మృతి చెందారు. నివాళులర్పించిన మంత్రి తలసాని దేవర కరుణాకర్ మృతి చెందిన విషయం తెలుసుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుడిమల్కాపూర్కు వచ్చేసి మృతదేహానికి నివాళులు అరి్పంచారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాసమస్యలపై గళమెత్తే నాయకుడని బల్దియా సమావేశాలలో ప్రజల మౌళిక సదుపాయాల కోసం ఆయన నిరంతరం ప్రశ్నించే వారని అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నగర మాజీ మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్, నగరానికి చెందిన వివిధ డివిజన్ల బీజేపీ కార్పొరేటర్లు కరుణాకర్ మృతదేహానికి నివాళులు అరి్పంచారు. -
హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో ఉద్రిక్తత
-
కియాలో డీలర్షిప్ ఇస్తామంటూ మోసం
హిమాయత్నగర్: ప్రముఖ కార్ల కంపెనీ కియా ఇండియా డీలర్షిప్ నీదేనంటూ గుడిమల్కాపూర్కు చెందిన ఓ వ్యాపార వేత్తకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. పలు డాక్యుమెంట్ల రూపంలో అతడి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేశారు. డీలర్షిప్ ఇవ్వకపోవడంతో సోమవారం బాధితుడు సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కేవీఏ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. రమణకుమార్ కియా కార్ల డీలర్షిప్ కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు. దీంతో ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేసి తాను కియా కంపెనీకి సంబంధించిన వ్యక్తినని తెలిపాడు. ఇండియా డీలర్షిప్ ఇస్తామంటూ నమ్మించాడు. పలు డాక్యుమెంట్స్ తదితర ఖర్చులంటూ రూ.11లక్షలు దోచుకున్నారు. డీలర్షిప్ ఆలస్యం కావడంతో ఇదంతా బోగస్ అని గుర్తించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. క్రిప్టోకరెన్సీ పేరుతో రూ.25 లక్షలు స్వాహా.. క్రిప్టో కరెన్సీలో లాభాలు ఇస్తామంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. సైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్కు చెందిన గుంజన్శర్మ క్రిప్టోకరెన్సీలో బినాన్స్ కొనుగోలు చేసి వాటిని జీడీఎక్స్ అనే యాప్లో పెట్టుబడిగా రూ.25లక్షలు పెట్టాడు. ఆ మొత్తానికి లాభాలు చూపిస్తున్నారే కానీ డబ్బు డ్రా చేసేందుకు ఇవ్వట్లేదు. వారి నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఇదంతా ఫేక్ అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. (చదవండి: పోలీసు కస్టడీకి అభిషేక్, అనిల్ ) -
గుడిమల్కాపూర్ మార్కెట్ కు చేరుకుంటుంన్న ప్రజలు, వ్యాపారాలు
-
మద్యం మత్తులో దొరికిపోయి.. హల్చల్!
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో వాహనం నడుపుతూ దొరికిపోయిన ఓ వ్యక్తి నగరంలో హల్చల్ చేశాడు. ఆసిఫ్నగర్-గుడి మల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మహ్మద్ షఫీ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికిపోయాడు. తనను పట్టుకోవడంతో అతను పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. కాసేపు మద్యం మత్తులో హల్చల్ చేశాడు. చివరికి పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి.. షఫీని పంపించారు. -
పబ్లిక్ మేనిఫెస్టో గుడిమల్కాపూర్ డివిజన్
-
పూల మార్కెట్లో అగ్నిప్రమాదం: 50 లక్షలు నష్టం
-
ఏపీఎన్జీవోల సభలకు జాతీయ పార్టీల నేతలు
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని అన్ని జాతీయ పార్టీల నేతల దృష్టికీ తీసుకెళ్తాం. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని కోరతాం’’అని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు చెప్పారు. సమైక్యానికి మద్దతుగా తాము నిర్వహించబోయే సమావేశాలకు ఆయా పార్టీల నేతలను కూడా ఆహ్వానిస్తున్నట్టు శుక్రవారం వెల్లడించారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో శనివారం నిర్వహించే సభ ఏర్పాట్లను పరిశీలించాక విలేకరులతో మాట్లాడారు. సభకు ఉద్యోగులతోపాటు సమైక్యాన్ని కోరుతున్న సంఘాల సభ్యులు, పార్టీల నేతలు ఐదు వేల మంది వస్తారన్నారు. విభజన జరగాలంటే రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన తప్పదన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర పార్టీల నేతలనూ పిలిచాం పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా సభకు హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ నేతలు మండలి బుద్ధప్రసాద్, తులసి రెడ్డి, దేశం నేతలు పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలతోపాటు మజ్లిస్, సీపీఎం నేతలను ఆహ్వానించినట్టు అశోక్బాబు వెల్లడించారు. కొద్దిరోజుల్లో తిరుపతి, మదనపల్లిల్లో కూడా ఈ తరహా సభలు నిర్వహించనున్నామని, వాటికి జాతీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. విభజన తథ్యమన్నట్టుగా సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలు అంటున్నా తాము మాత్రం చివరికంటా పోరాటం చేస్తామని, అసెంబ్లీకి ముసాయిదా బిల్లు వచ్చిన వెంటనే మరోసారి సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. కిరణ్కుమార్రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించినా తమ ఉద్యమానికి వచ్చే నష్టమేదీ లేదని, ఆయన సమైక్యవాదిగా ఉన్నంతమాత్రాన తమకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. ఈ నెల 17న ఉయ్యూరు, ఏలూరులలో రైతు సభలు, 19న పాలకొల్లులో, 28న కడపలో సభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వచ్చే సమ్మెను గాంధేయమార్గంలో కాకుండా నేతాజీ పంథాలో నిర్వహించాలని ఉద్యోగ సంఘాలకు సూచించినట్టు సీమాంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
నగరంలో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సమావేశం ప్రారంభం
సీమాంధ్రలోని న్యాయవాదుల జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశం శనివారం గుడిమల్కాపూర్లోని అశోక గార్డెన్స్లో ప్రారంభమైంది. ఆ సమావేశానికి సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఆ సదస్సును అడ్డుకునేందుకు తెలంగాణవాదులు యత్నించారు. ఆ క్రమంలో వారు అశోక గార్డెన్స్ సమీపంలోని వాటర్ట్యాంక్ ఎక్కి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.


