తణుకు, న్యూస్లైన్ : చలిగాలులు పెరిగారుు. మడుల్లోని నారు ఎదుగుదలను దెబ్బతీస్తున్నారుు. ఫలితంగా వరినాట్లు ఆలస్యమవుతున్నారుు. ఊడ్పులకు అదును దాటిపోతుండటంతో రానున్న రోజుల్లో సాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మడుల్లో 21నుం చి 30 రోజులపాటు పెరిగిన (రెండుమూడు ఆకులున్న) నారును చేలల్లో నాటుతారు.
రాత్రి ఉష్ణోగ్రతలు 14-15 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గిపోవటం, పొగమంచు అధికంగా కురవడంతో నారు ఎదగటం లేదు. 21 రోజులు దాటినా మళ్లలోని నారు 15 రోజుల క్రితం వేసినట్టుగా ఉంటోంది. దీనిని చేలల్లో ఊడ్చితే నీట మునిగి కుళ్లిపోతుందనే భయంతో నాట్లు వేయడానికి రైతులు సాహసం చేయలేకపోతున్నారు. మరోవైపు నాట్లు వేసిన చేలల్లోని వరి సైతం సక్రమంగా ఎదగకపోవటంతో ఎక్కువ నారు ఉపయోగించాల్సి వస్తోంది.
దీనివల్ల నారు సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. సాధారణంగా రబీలో ఎకరం పొలంలో నాటడానికి 37నుంచి 50 కేజీల విత్తనాన్ని నారుపోస్తారు. 50 కేజీల విత్తనం వేసినా ఆ నారు ఎకరంలో నాటడానికి సరిపోవడం లేదు.
పొంచివున్న సాగునీటి కష్టాలు
జనవరి మొదటి వారానికల్లా వరినాట్లు పూర్తి చేస్తేనే రైతులు సాగునీటి ఎద్దడి నుంచి బయటపడగలుగుతారు. మార్చి 31నాటికి కాలువల కట్టివేస్తామని అధికారులు ప్రకటించారు. నాట్లు ఆలస్యమైతే సాగు చివరి దశలో నీటికి కొరత ఏర్పడుతుందని ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తణుకు ప్రాంతంలో 75శాతం ఆయకట్టులో మాత్రమే వరినాట్లు పూర్తరుునట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది.
తూర్పువిప్పర్రు, కె.ఇల్లిందలపర్రు, తణుకు, దువ్వ, కంతేరు, కత్తవపాడు, రేలంగి, కొత్తపాడు, పొదలాడ, కొమ్మర, ఈడూరు తదితర ప్రాంతాల్లో నాట్లు పూర్తికాలేదు. మరో 10 రోజులకు గాని ఊడ్పులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. నాట్లు 20 రోజులపాటు ఆలస్యమవుతున్నాయని, కాలువలు కట్టివేసే విషయంలో ఇరిగేషన్ అధికారులు స్పష్టత ఇవ్వకపోతే ఆలస్యంగా ఊడ్చిన రైతులు ఇబ్బందిపడే ప్రమాదం ఉందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇస్తే తప్ప రైతులు గట్టెక్కే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు.
నాట్లు.. పాట్లు
Published Wed, Jan 22 2014 2:04 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కమల్హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్గా! (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
స్పేస్లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (19-05-2024)
టీడీపీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement