చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కొప్పు సముద్రంలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డును దుండగులు దారుణంగా హత్య చేశారు.
చిత్తూరు : చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కొప్పు సముద్రంలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డును దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కొప్పు సముద్రం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(55) అనే మాజీ ఆర్మీ అధికారి ఎస్బీఐ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కొందరు సుబ్రమణ్యాన్ని హత్య చేసి ఆయన మృతదేహంపై యాసిడ్పోసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(గుడిపాల)