30 అడుగులు ముందుకు వచ్చిన సముద్రం | Sea comes to 30 feets ahead Coastal area | Sakshi
Sakshi News home page

30 అడుగులు ముందుకు వచ్చిన సముద్రం

Jul 17 2014 2:10 AM | Updated on Sep 2 2017 10:23 AM

వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రంలో వీస్తున్న గాలులకు విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలోని చింతపల్లిలో బుధవారం తెల్లవారుజామున సముద్రం 30 అడుగుల మేర ముందుకు వచ్చింది.

పూసపాటిరేగ: వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రంలో వీస్తున్న గాలులకు విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలోని చింతపల్లిలో బుధవారం తెల్లవారుజామున సముద్రం 30 అడుగుల మేర ముందుకు వచ్చింది. దీంతో తీరం వద్ద ఉన్న వలలు సముద్రంలో కొట్టుకు పోయి సుమారు రూ.3లక్షల వరకు నష్ట పోయినట్లు మత్స్యకారులు తెలిపారు. తీరం అంచున ఉన్న పడవల కిందకు సముద్రం నీరు చేరడంతో వారు ఆందోళనకు గురయ్యారు. అధికారుల హెచ్చరికలతో కొందరు మత్స్యకారులు వేటకు వెళ్లలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement