సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు తరలిరండి | Save Andhra Pradesh meeting on friday | Sakshi
Sakshi News home page

సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు తరలిరండి

Sep 20 2013 1:41 AM | Updated on Sep 1 2017 10:51 PM

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో తలపెట్టిన ’సేవ్ ఆంధ్రప్రదేశ్’

ఏలూరు అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో తలపెట్టిన ’సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభకు సమైక్యవాదులు పెద్దెత్తున తరలిరావాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. సమైక్యవేదిక రాష్ట్ర చైర్మన్ పరుచూరి అశోక్‌బాబు అధ్యక్షతన జరిగే ఈ సభకు సమైక్యవాదులంతా స్వచ్ఛందంగా ఎవరికి వారు హాజరుకావాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సీమాంధ్ర ప్రజల సమైక్యవాదనను కేంద్రానికి బలంగా వినిపించాలని నాయకులు కోరారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement