అనంతపురంలో టీడీపీ నేతల అరాచకం | retired teacher bhagya laxmi kidnap in anantapur district | Sakshi
Sakshi News home page

అనంతపురంలో టీడీపీ నేతల అరాచకం

May 20 2017 3:12 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి

అనంతపురం: అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. జేసీ బ్రదర్స్‌ నేమ్‌ స్టిక్కర్‌లను వాహనాలకు తగిలించుకొని టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు.

భాగ్యలక్ష్మి అనే రిటైర్డ్‌ టీచర్‌ ఆస్తిపై కన్నేసిన టీడీపీ నేత రమేష్‌రెడ్డి.. ఒంటరిగా ఉంటున్న ఆమెను కిడ్నాప్‌ చేశాడు. బెదిరించి ఆస్తి రాయించుకోవడంతో పాటు.. ఆమె అకౌంట్‌ నుంచి రూ. కోటి డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాకను గమనించిన రమేష్‌ రెడ్డి, అతడి అనుచరులు బ్యాంకు వద్ద నుంచి పరారయ్యారు. ఈ వ్యవహారంలో రమేష్‌రెడ్డి ఉపయోగించిన బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంపై జేసీ బ్రదర్స్‌ నేమ్‌ స్టిక్కర్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం భాగ్యలక్ష్మి పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement