13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

సాక్షి, చంద్రగిరి: శేషాచలంలోని ఎర్రగుట్ట ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా దాచిన 13 ఎర్రచందనం దుంగలను ఆర్‌ఎస్సై వాసు బృందం ఆదివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఆర్‌ఎస్సై వాసు బృందం కూంబింగ్‌ చేపట్టారు. నరసింగాపురం ఎస్టీకాలనీ వద్ద కూబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అధికారులను చూసి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశాడు. అధికారులు వెంబడించినా లాభం లేకపోయింది. ఎర్రగుట్ట వద్ద తనిఖీ చేయడంతో చెట్ల పొదల్లో దాచిన సుమారు 13 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన కూలీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడుల్లో డీఆర్వో నరసింహరావు, ఎఫ్‌బీవో జానీబాషా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top