నిధుల కోసం ఎర్రచందనం విక్రయం: యనమల | red sandal to sale for collecting funds, says yanamala ramakrishna | Sakshi
Sakshi News home page

నిధుల కోసం ఎర్రచందనం విక్రయం: యనమల

Jun 20 2014 2:16 AM | Updated on Aug 27 2018 8:44 PM

నిధుల కోసం ఎర్రచందనం విక్రయం: యనమల - Sakshi

నిధుల కోసం ఎర్రచందనం విక్రయం: యనమల

నిధుల సమీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిల్వ ఉన్న ఎర్రచందనం విక్రయించాలని నిర్ణయించినట్లు రాష్ర్ట ఆర్థిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: నిధుల సమీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిల్వ ఉన్న ఎర్రచందనం విక్రయించాలని నిర్ణయించినట్లు రాష్ర్ట ఆర్థిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. ఎర్రచందనం విక్రయించడానికి అంతర్జాతీయ టెండర్లను పిలవాల్సి ఉంటుందని, దీనికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ చట్టం(ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement