ఒంటిమిట్టలోనే ఉత్సవాలకు కలెక్టర్ సిఫార్సు | recommend festivals collector | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్టలోనే ఉత్సవాలకు కలెక్టర్ సిఫార్సు

Feb 6 2015 1:40 AM | Updated on Mar 21 2019 8:35 PM

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ సంవత్సరం నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కేవీ రమణ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.

కడప కల్చరల్: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ సంవత్సరం నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కేవీ రమణ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఈ మేరకు రెవెన్యూ, దేవాదాయశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులకు ఆయన గురువారం ప్రత్యేకంగా లేఖ రాశారు.
 
 ఒంటిమిట్ట ఆలయ కార్యనిర్వహణాధికారి సమర్పించిన ప్రతిపాదనలను తాము ప్రభుత్వానికి పంపామని కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్రం విడిపోకముందు ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రామాలయంలో ప్రభుత్వంశ్రీరామనవమి వేడుకలను నిర్వహించేది. ప్రస్తుతం ఆ ఆలయం తెలంగాణకు దక్కగా, రాష్ర్టంలోని అత్యంత పురాతమైన, ఎన్నో విశిష్టతలుగల ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలోనే ప్రభుత్వ లాంఛనాలతో ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ లేఖ ద్వారా కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement