
రావెల కిషోర్ బాబు
బీజేపితో పొత్తుపై ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు: బీజేపితో పొత్తుపై ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపితో పొత్తు విషయమై తాము పునరాలోచన చేసుకుంటామని చెప్పారు. ఆత్మపరిశీలన చేసుకొని ముందుకు వెళతామన్నారు. ఆ పార్టీతో ఎంతవరకు మిత్రపక్షంగా కొనసాగాలో నిర్ణయించుకుంటామని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధి కోసమే బీజేపితో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. తమ సిద్ధాంతాల విషయంలో వారితో రాజీపడేది లేదని మంత్రి రావెల స్పష్టం చేశారు.
**