పల్లె సీమల్లో సిరులు కురవాలి | Ravali Jagan Kavali Jagan in Prakasam | Sakshi
Sakshi News home page

పల్లె సీమల్లో సిరులు కురవాలి

Sep 27 2018 2:05 PM | Updated on Sep 27 2018 2:05 PM

Ravali Jagan Kavali Jagan in Prakasam - Sakshi

ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

‘పల్లె సీమల్లో ప్రతి ఇంటా సిరులు కురవాలి.. ప్రతి ఒక్కరికీ నవరత్నాలు చేరువ కావాలి.. భావితరం భవిత బాగుండాలని కాంక్షించే ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌ సీపీకి మద్ధతు పలకాలి.. టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా గ్రామాభివృద్ధిని విస్మరించింది. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించింది. అందుకే వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకుందాం. రాజన్న రాజ్యం తిరిగి తెచ్చుకుందాం. అందుకోసం మీరంతా చేయి చేయి కలిపి సంఘీభావం ప్రకటించాలి’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు నిచ్చారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించిన సందర్భంగా జిల్లాలో ఆ పార్టీ నేతలు సంఘీభావ యాత్రలు కొనసాగించారు. పల్లె ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. బుధవారం ఒంగోలు రూరల్‌ మండల పరిధిలో పర్యటించిన బాలినేని నవరత్నాలపై ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.

సాక్షి ప్రతినిధి,ఒంగోలు: ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జిల్లాలో పార్టీ నేతలు బుధవారం సంఘీభావ యాత్రలు నిర్వహించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఒంగోలు రూరల్‌ మండలంలోని బొద్దులూరివారిపాలెం, ఉలుచి, చేజర్ల వరకు ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని  శ్రీనివాసరెడ్డి బుధవారం జగన్‌ పాదయాత్రకు మద్దతుగా సంఘీభావయాత్ర జరిగింది. మహిళలను, వృద్ధులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, తదితర నాయకులు బాలినేని వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.
మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలం మునగపాడు నుంచి వెలిగండ్ల వరకు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆద్వర్యంలో జగన్‌ యాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర నిర్వహించారు. నవరత్నాలుపై ప్రచారం చేపట్టారు.  
యర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం నుంచి యర్రగొండుపాలెం ఆయ్యంబొట్ల పల్లె వరకు ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్‌ జగన్‌ పాదయాత్ర నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు.
గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని కంభం మండలంలోని ఎర్రపాలెం నుంచి రాచెర్ల వరకు సమన్వయకర్త ఐవీరెడ్డి ఆధ్వర్యంలో  పాదయాత్ర నిర్వహించారు.
కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌ పురం మండల కేంద్రం నుంచి కొయిలంపాడు వరకు సమన్వయకర్త బుర్రా మధుసూధన్‌యాదవ్‌ జగన్‌ పాదయాత్రకు సంఘీభావంగా కార్యకర్తలతో కలిసి నడిచారు.
పర్చూరు నియోజకవర్గంలో సమన్వయకర్త  రావి రామనాథంబాబు ఆధ్వరంలో కారంచేడు మండలంలోని దగ్గుపాడు నుంచి ఇంకొల్లు వరకు  జగన్‌ యాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర నిర్వహించారు.
చీరాల నియోజకవర్గ పరిధిలోని రూరల్‌ మండల పరిధి కొత్తపాలెం నుంచి దేశాయిపేట వరకు పార్టీ సమన్వయకర్త యడం బాలాజీ జగన్‌కు మద్దతుగా సంఘీభావ పాదయాత్రను నిర్వహించారు.
సంతనూతలపాడు నియోజకవర్గంలో సమన్వయకర్త టీజేఆర్‌ సుధాకరబాబు ఆధ్వరంలో మద్దిపాడు మండలం నేలటూరు నుంచి వెల్లంపల్లి సంటర్‌ వరకు జగన్‌ యాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర నిర్వహించారు.  
అద్దంకి మండలం కవలకూరు నుంచి ధర్మవరం గ్రామం వరకు సమన్వయకర్త బాచిన చెంచు గరటయ్య ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర జరిగింది.
కందుకూరు పట్టణంలో బృందావన్‌ కాలనీలో మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement