ప్రత్యేక హోదా..ఆంధ్రుల హక్కు నినాదంతో జాతీయ పార్టీ నేతలతో వచ్చేనెల 4వ తేదీన భీమవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు.
ఏపీలో రాహుల్ పర్యటన
May 27 2017 6:22 PM | Updated on Aug 18 2018 5:57 PM
భీమవరం: ప్రత్యేక హోదా..ఆంధ్రుల హక్కు నినాదంతో జాతీయ పార్టీ నేతలతో వచ్చేనెల 4వ తేదీన భీమవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు. శనివారం భీమవరం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేపల రాము ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రఘువీరా రెడ్డి మాట్లాడుతూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ ఈ బహిరంగ సభకు వస్తున్నారని, ఆయనతో పాటు సమాజ్ వాదీ పార్టీ మాజీ సీఎం అభిలేష్ యాదవ్, వివిధ పార్టీల అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి. రాజా, శరద్ యాదవ్, కె మోహన్ తోపాటు ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతున్న వివిధ పార్టీ నాయకులు వస్తున్నారన్నారు.
Advertisement
Advertisement