ఈ నెల 19 నుంచి పల్స్ పోలియో | Pulse polio immunisation programme on January 19 | Sakshi
Sakshi News home page

ఈ నెల 19 నుంచి పల్స్ పోలియో

Jan 9 2014 3:15 AM | Updated on Sep 2 2017 2:24 AM

ఈ నెల 19 నుంచి పల్స్ పోలియో

ఈ నెల 19 నుంచి పల్స్ పోలియో

ఈనెల 19న జాతీయ పల్స్ పోలియో దినంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈనెల 19న జాతీయ పల్స్ పోలియో దినంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అహ్మద్ బాబు తెలిపారు. గురువారం వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమావేశంలో పేర్కొన్నారు. 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. వంద శాతం చుక్కల మందు వేయాలన్నారు. ఈ నెల 21, 22 తేదీలలో ఇంటింటికి వెళ్లి పిల్లల వివరాలు సేకరించి చుక్కల మందులు వేయాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలకు సూచించారు. ఇందుకోసం 5.40 లక్షల వ్యాక్సిన్‌లు జిల్లాకు అందాయని తెలిపారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలు జిల్లాలో 3,62,523 ఉన్నారని అంచనా వేశామన్నారు. చక్కుల మందులకు సంబంధించిన గ్రామాల్లో పది రోజుల ముందుగానే బ్యానర్లు, పోస్టర్లు అతికించాలన్నారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, వంద శాతం పోలియో చుక్కలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఎంహెచ్‌వో మేకల స్వామి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement