ఇద్దరు ఏఎంఓహెచ్ల కుర్చీలు ఖాళీ
ట్రేడ్లకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరి
పూర్తిస్థాయిలో ఆధార్ అటెండెన్స్కు కసరత్తు
విజయవాడ సెంట్రల్ : ప్రజారోగ్య శాఖలో పేరుకుపోయిన అవినీతి మకిలిని వదిలించేందుకు కమిషనర్ జి.వీరపాండియన్ కసరత్తు చేస్తున్నారు. టార్గెట్లు, డెడ్లైన్లతో ఠారెత్తిస్తున్నారు. మాట వినకుంటే సస్పెన్షన్ తప్పదన్న హెచ్చరికలు జారీచేస్తున్నారు. దీర్ఘకాలికంగా పాతుకుపోయిన అధికారుల పీఠాలు కదిలిస్తున్నారు. తొలి విడతగా ఏఎంఓహెచ్ (అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు) 1, 3 ఎం.గోపీనాయక్, పి.రత్నావళిని సాగనంపాలని నిర్ణయించారు. దీంతో వారిద్దరూ హైదరాబాద్లో పైరవీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ప్ర‘దక్షిణ’లు
డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు చెందిన గోపీనాయక్, రత్నావళి 2012 ఆగస్టులో డిప్యుటేషన్పై నగరపాలక సంస్థకు వచ్చారు. గత ఏడాదితోనే వీరి డిప్యుటేషన్ గడువు పూర్తికాగా వ్యక్తిగత, ఆరోగ్య కారణాల దృష్ట్యా మరో ఏడాది పొడిగించాల్సిందిగా పేరెంట్ డిపార్ట్మెంట్ను కోరారు. ఈ ఏడాది ఆగస్ట్ వరకు పొడిగించారు. వీరి పనితీరు బాగోలేదంటూ మేయర్ కోనేరు శ్రీధర్ పలుమార్లు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ స్వీయ పర్యవేక్షణలోనూ అదే తేలింది. ఈ క్రమంలో మరో ఏడాది తమను నగరపాలక సంస్థలోనే కొనసాగించాలని కోరుతూ అధికారులిద్దరూ పేరెంట్ డిపార్ట్మెంట్ చుట్టూ ప్ర‘దక్షిణ’లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల రెండున రత్నావళిని రిలీవ్ చేయాలంటూ వారం రోజుల క్రితమే పబ్లిక్హెల్త్ అండ్ ఫ్యామిటీ వెల్ఫేర్ డెరైక్టర్ ఉత్తర్వులిచ్చారు. ప్రజారోగ్యశాఖకు చెందిన ఈ ఉత్తర్వుల్ని అదనపు కమిషనర్ జి.నాగరాజుకు చేరాల్సి ఉండగా, రత్నావళి మధ్యలో హైజాక్ చేశారని సమాచారం. ఇది కమిషనర్ చెవినపడటంతో సీరియస్ అయ్యారు. వెంటనే ఆమెను రిలీవ్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఆ స్థానంలో ఆయుర్వేద ఆస్పత్రి ఇన్చార్జిగా పనిచేస్తున్న రామకోటేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. గోపీనాయక్ డిప్యుటేషన్ గడువు ఈ నెల 6 తేదీతో ముగియనుంది.
అక్రమాలకు చెక్
డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్ఓ) ట్రేడ్ లెసైన్సుల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని కమిషనర్ నిర్ణయించారు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు ఆరు రోజుల్లోపు జారీ చేయాలని డెడ్లైన్ విధించారు. గడువులోపు సర్టిఫికెట్లు జారీ చేయకుంటే శానిటరీ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. నగరంలో 36 వేల డీఅండ్ఓ ట్రేడ్ లెసైన్స్లు ఉన్నాయి. ఇందులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. గతంలో గవర్నర్పేట ప్రాంతంలో వసూలుచేసిన సొమ్మును ఎస్ఐ సొంత ఖర్చులకు వాడేసిన సంగతి తెలిసిందే. సుమారు 8 వేల డీఅండ్ఓ ట్రేడ్ లెసైన్స్ల నుంచి రూ.1.50 కోట్లు వసూలు కావాల్సిఉంది. నగరంలో వ్యాపారాలు విస్తరిస్తున్నప్పటికీ ఆస్థాయిలో డీఅండ్ఓ ట్రేడ్ల వసూళ్లు పెరగడం లేదు. ఎస్ఐల చేతివాటంపై విమర్శలున్నాయి. ఈక్రమం డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లను తెరపైకి తేవడం ద్వారా పారదర్శకంగా వ్యవహరించవచ్చన్నది కమిషనర్ ఆలోచనగా తెలుస్తోంది.
ఆధార్ తప్పనిసరి
పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్లే ప్రజారోగ్యశాఖ గాడితప్పిందన్న అభిప్రాయానికి కమిషనర్ వచ్చారు. మస్తర్ల మాయ పేరుతో ప్రతి నెలా లక్షలాది రూపాయల్ని నొక్కేస్తున్నారు. ఆధార్ అటెండెన్స్తో అక్రమాలను సరిదిద్దాలన్నది కమిషనర్ ఆలోచన. ఏడెనిమిది డివిజన్లలో మాత్రమే ప్రస్తుతం ఆధార్ అటెండెన్స్ విధానం అమల్లో ఉంది. దీన్ని అన్ని డివిజన్లలో అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అర్బన్ క మ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) ద్వారా ట్యాబ్లు సిద్ధం చేశారు. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి త్వరలోనే ఆధార్ అటెండెన్స్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. మూడు సర్కిళ్ల పరిధిలో 12 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరుపై కమిషనర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారిపై వేటు వేయనున్నట్లు సమాచారం.
ప్రజారోగ్యం ప్రక్షాళన
Published Mon, Aug 3 2015 12:39 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మల్లె మొగ్గ మూవీ సక్సెస్ మీట్.. పోస్టర్ లాంఛ్!
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
పాయల్ రాజ్పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
ఐఫోన్పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
రతన్టాటా.. అణువణువూ ఆదర్శమే..!
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement