ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీరాజ్‌

Prudhvi Raj Appointed As SVBC Chairman - Sakshi

సాక్షి, అమరావతి : ప్రముఖ నటుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పృథ్వీరాజ్‌ నియామకానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టీటీడీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్‌ నియామకానికి అనుగుణంగా చట్ట సవరణకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top