ప్రిన్సిపాల్‌ను తొలగించాలని విద్యార్థినుల ధర్నా | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్‌ను తొలగించాలని విద్యార్థినుల ధర్నా

Published Tue, Apr 21 2015 3:16 PM

principal allegedly addressed girl students in vulgar language

చిత్తూరు : అసభ్య పదజాలంతో దూషిస్తున్న ప్రిన్సిపాల్‌ను తొలగించాలని విద్యార్థినులు రోడ్డెక్కిన సంఘటన చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో మంగళవారం చోటుచేసుకుంది.

కొత్తకోటలోని మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్ చంద్రకుమార్ అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా అసభ్యంగా మాట్లాడుతున్నాడని మనస్థాపం చెందిన విద్యార్థినులు ఎమ్‌ఈవోకు వినతిపత్రం అందించారు. అనంతరం వెంటనే ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్సీ భవనం ఎదుట ధర్నాకు దిగారు.

Advertisement
Advertisement