ప్రతిభా భారతికి తీవ్ర అనారోగ్యం
ఆస్పత్రిలో తండ్రిని చూసేందుకు వచ్చిన మాజీ స్పీకర్
ఎమ్మెల్సీ భారతి పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్, టీడీపీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభా భారతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పినాకిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్య (92) ను చూసేందుకు ఆమె శుక్రవారం విశాఖపట్నం వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ప్రతిభా భారతికి అత్యవసర చికిత్స అందిస్తున్నామనీ, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.
సంబంధిత వార్తలు