.... అదే గ్రామానికి చెందిన వడ్ల వెంకటప్పకు ఇందిరమ్మ ప థకం కింద అనుమతించారు. పునాది వరకు సొంత డబ్బులతో ఇంటి నిర్మాణం సాగించాడు. ఇందిరమ్మ బిల్లు మంజూ రు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వ పరంగా బిల్లు మంజూరు కాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో నిర్మాణాన్ని నిలిపేయాల్సి వచ్చిందని వెంకటయ్య చెబుతున్నాడు.
... దౌల్తాబాద్కు చెందిన శంకరమ్మకు ఇందిరమ్మ తొలి విడత కింద ఇల్లు మంజూరైంది. బిల్లులు ఎప్పుడైనా మంజూరవుతాయన్న ఆశతో ఆమె స్లాబ్ వరకు ఏడాది కిందట ఇంటిని నిర్మించుకుంది. అందుకు సంబంధించి బేస్మెంట్ లెవల్ బిల్లు మాత్రమే ఇచ్చారని, గతంలో నాట్ స్టార్టెడ్ అంటూ ఏడాదిపాటు తిప్పుకున్నారని... మిగిలిన బిల్లు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోందని, దీంతో మిగిలిన ఇంటి నిర్మాణం పూర్తిచేయలేక, ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణానికి అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నానని శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా.. జిల్లాలో పలువురు ఇంది రమ్మ లబ్దిదారులు సకాలంలో నిధులు మంజూరు కానందున ఇంటిని నిర్మించుకోలేక ఇబ్బంది పడాల్సి వస్తోంది...
న్యూస్లైన్, పాలమూరు: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 40,217 ఇండ్లను పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటి వరకు కేవలం 19,357 ఇళ్లకు మాత్రమే బిల్లులు మంజూరయ్యాయి. ఇందులోనూ కొందరు లబ్దిదారులకు అరకొరగా అందినట్లు తెలుస్తోంది. నిర్దేశించిన లక్ష్యం 50 శాతం కూడా చేరుకోకపోవడంతో సొంతింటి నిర్మించుకోవాలని భావించిన నిరుపేదలు అయోమయానికి గురవుతున్నారు. కొన్నిచోట్ల అధికారులు బిల్లుల పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. సిమెంటు, బిల్లుల పంపిణీ ఆలస్యం అవుతుండటంతో లబ్దిదారులు నిర్మాణాలను పూర్తి చేసుకోలేక అవస్థ పడుతున్నారు.
లక్ష్యమూ..గగనమే...
ఇందిరమ్మ మొదటి, రెండు, మూడు విడతలతోపాటు రచ్చబండ 1, రచ్చబండ 2 కింద 5.52 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 2.13లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.2.59లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 40వేల ఇళ్లు గోడల స్థాయిలో 25వేల ఇళ్లు గోడలకన్నా తక్కువ స్థాయిలో ఉండగా.. 35వేల ఇళ్లు పునాది కన్నా తక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 50 రోజులు గడువు ఉండటంతో అందరు లబ్దిదారులకు నిధులు మంజూరయ్యే పరిస్థితులు కనబడటంలేదు. ఈ ఏడాది 40,217 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇప్పటి వరకు 19,357 మాత్రమే పూర్తి చేశారు. చివరికి లబ్దిదారుడు ఎంతో కొంత మామూళుల ముట్టచెపితే బిల్లు మంజూరుకు ఎంబుక్ రికార్డు చేసి పంపుతున్నారు. అలా ఇచ్చుకోలేనివారికి ఇక ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు వచ్చే అదనపు మొత్తంలో అధికారులు అందినంత గుంజుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
వేధిస్తున్న సమస్యలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సిమెంటు కొరత అధికంగా ఉంది. ధర పెంచే వరకు సరఫరా చేసేది లేదని కంపెనీలు తెగేసి చెప్పాయి. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నవంబర్లో సరఫరాను తగ్గించాయి.
సిమెంటు కొరత వల్ల కూడా ఒక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పూర్తి కావడం లేదు.
స్థలం లేని లబ్దిదారులకు కేటగిరి-3 కింద గుర్తించి ప్రభుత్వం ఊరి బయట ప్రభుత్వ స్థలాన్ని సేకరించి ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది.
అయితే జిల్లాలో స్థల సేకరణ పూర్తి చేయడం లేదు. లబ్దిదారులను ఊరిస్తూ.. ఇళ్ల స్థలాల పంపిణీ అప్పుడు, ఇప్పుడూ అంటూ కాలయాపన చేస్తుండటం ఇబ్బందిగా మారింది.
బిల్లులు...చిల్లులు
Published Sat, Feb 8 2014 3:01 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
లైఫ్లో మర్చిపోలేని వంటింటి చిట్కాలివిగో!
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్కు ఎలా అంటగడతారు?’
హైదరాబాద్లో భారీ వర్షం
స్టార్ హీరో పాదాలకు నమస్కరించిన టాలీవుడ్ డైరక్టర్!
ఈ సౌత్ ఇండియన్ భామలపై ఓ లుక్కేసుకోండి! (ఫొటోలు)
ఎయిరిండియా భోజనంలో మెటల్ బ్లేడ్..!
ప్రియురాలితో సింపుల్గా నటుడి ఎంగేజ్మెంట్
ఢిల్లీ ఎయిర్పోర్టులో పవర్ కట్స్
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్.. రషీద్ ఖాన్ తర్వాత..!
నీట్ పై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రచ్చ
తప్పక చదవండి
- స్టార్ హీరోయిన్ కోసం చెరువులో దూకిన అభిమాని.. ఆ తర్వాత!
- అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్ను గమనించారా?
- ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
- ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
- T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
- ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- సిక్ప్యాక్! లుక్ కోసమైతే ఫసక్కే
- తల్లి కాటికి.. తండ్రి కటకటాలకు...!
Advertisement