
సీపీఐ జైల్భరోలో పలువురి అరెస్ట్
గుంటూరు ఈస్ట్: భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా సీపీఐ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆందో ళనలు ...
విజయవాడ బ్యూరో, గుంటూరు ఈస్ట్: భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా సీపీఐ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆందో ళనలు జరిగాయి. గురువారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని అరెస్టయ్యారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో ఆ పార్టీ కేంద్ర కార్యవర్గసభ్యుడు నారాయణ పాల్గొని అరెస్టయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 4వేలకు పైగా సీపీఐ కార్యకర్తలు జైల్భరోలో అరెస్టై అనంతరం విడుదలయ్యారు.