ఆ నాలుగు కుటుంబాలే పరిశ్రమను శాసిస్తున్నాయి | Only four Families are dominating Tollywood industry | Sakshi
Sakshi News home page

ఆ నాలుగు కుటుంబాలే పరిశ్రమను శాసిస్తున్నాయి

Jan 7 2014 1:52 AM | Updated on Sep 2 2017 2:21 AM

తెలుగు చిత్ర పరిశ్రమను దగ్గుబాటి రామానాయుడు, అల్లు అరవింద్, చిరంజీవి, ఎన్టీఆర్ కుటుంబాలే శాసిస్తున్నాయని, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లను వారి అధీనంలో పెట్టుకొని చిన్న నిర్మాతలకు థియేటర్లను ఇవ్వకుండా పొట్టగొడుతున్నారని ఆరోపిస్తూ న్యాయవాది అరుణ్‌కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు.

  • వారి వల్లే నటులకు అవకాశాలు రావడంలేదని హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు
  •  సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను దగ్గుబాటి, అల్లు అరవింద్, చిరంజీవి, ఎన్టీఆర్ కుటుంబాలే శాసిస్తున్నాయని, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లను వారి అధీనంలో పెట్టుకొని చిన్న నిర్మాతలకు థియేటర్లను ఇవ్వకుండా పొట్టగొడుతున్నారని ఆరోపిస్తూ న్యాయవాది అరుణ్‌కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు. ఈ మేరకు సోవువారం కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
     
    సినిమా పరిశ్రమలో ఈ కుటుంబాలే గుత్తాధిపత్యం చేస్తున్నాయని, దీంతో కొందరు నటులకు అవకాశాలు లేకుం డా పోతున్నాయని తెలిపారు. సినిమా అవకాశాలు లేకే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చిత్ర పరిశ్రమలో వీరి ఆధిపత్యంపై విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఆ 4 కుటుంబాల ఆధిపత్యం కారణంగా తమకు అన్యా యం జరిగిందంటూ ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులెవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామంటూ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు పేరిరెడ్డి నిరాకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement