ట్రావెల్స్ బస్సు బోల్తా: ఒకరు మృతి | one died in a road accident | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్ బస్సు బోల్తా: ఒకరు మృతి

Mar 26 2015 7:06 AM | Updated on Sep 2 2017 11:26 PM

అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో గురువారం వేకువజామున జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో గురువారం వేకువజామున జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఎస్‌ఎల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో బోల్తాపడింది. ఈప్రమాదంలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇరవై మంది గాయాలపాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement