వట్టిపోయిన పశుపిండోత్పత్తి కేంద్రం
శిథిలావస్థకు చేరిన ప్రయోగశాలలు
బీడుగా మారిన 530 ఎకరాలు
పశువుల పెంపకానికే పరిమితం
భూములపై కన్నేసిన కబ్జాదారులు
గడ్డిపెంపక కేంద్రంగా ప్రతిపాదనలు
సాక్షి, నరసరావుపేట
మేలుజాతి పశువుల పునరుత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బఫెలో బ్రీడింగ్ సెంటర్ (పశు పిండోత్పత్తి కేంద్రం) వట్టిపోయింది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు, ప్రయోగశాలలు శిధిలావస్థకు చేరాయి. ఐదు దశాబ్దాల కిందట నాగార్జున సాగర్ ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం బఫెలో బ్రీడింగ్ సెంటర్ నెలకొల్పింది. అయితే సాగర్ నిర్మాణ సమయంలో ఈ కేంద్రం ముంపు బారినపడటంతో నకరికల్లు మండలం నర్సింగపాడు శివారులోని 530 ఎకరాల అటవీ భూముల్లోకి దీనిని మార్పు చేసింది. దీని అవసరాల కోసం త్రిపురాపురం వద్ద 130 ఎకరాల భూమిని కేటాయించింది.
గుజరాత్లోని ఆనంద్ కేంద్రంగా పనిచేసే జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ(ఎన్డీడీబీ) ఏర్పాటు చేసిన బఫెలో బ్రీడింగ్ సెంటర్ సహకారంతో ఇక్కడ మేలు జాతి ముర్రా గేదెలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. వీటి కోసం నర్సింగపాడు శివారులో ప్రయోగశాలలు నిర్మించారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే శాస్త్రవేత్తలు, డాక్టర్లు, సిబ్బందికి ప్రత్యేక సదుపాయాలు కలిగిన గృహ సముదాయాలు నిర్మించారు. త్రిపురాపురంలోని130 ఎకరాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి తీసుకువచ్చిన గేదెలను పరీక్షల నిమిత్తం ఇక్కడ ఉంచేవారు. ఆరు,ఏడు నెలల అనంతరం వాటికి ఎలాంటి జబ్బులు లేవని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే బీబీసీ కేంద్రానికి తీసుకొచ్చి పునరుత్పత్తి జరిపేవారు. ఈమేలు రకం గేదెల గర్భాశయంలో పిండాలను వృద్ధి చేసి ఏడు రోజుల తరువాత వాటిని ఎదకు వచ్చిన స్థానిక గేదెల గర్భాశయంలో ప్రవేశపెట్టడం ద్వారా ఎక్కువ పాలు ఇచ్చే మేలు జాతి గేదెలను ఉత్పత్తి చేయడమే ఈ సెంటర్ లక్ష్యం. మొదట్లో బ్రహ్మాండంగా కొనసాగిన ఈ కేంద్రం రానురాను పాలకులు, అధికారుల అలసత్వంతో లక్ష్యాన్ని చేరుకోలేక 1992లో మూతపడింది. దీంతో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్థి సంస్థ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ సంస్థకు క్షీణదశ మొదలైంది. కొన్నాళ్లు పాడిగేదెల కేంద్రంగా, మరికొన్నాళ్లు గడ్డి విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా ఈ సంస్థను మార్చారు.
పశువుల పెంపకానికే పరిమితం
వేల కోట్ల విలువైన పొలాలు, కట్టడాలు, అధునాతన సాంకేతిక పరికరాలు ఉన్న బీబీసీ కేంద్రం ప్రస్తుతం సామాన్య పశువుల పెంపక కేంద్రంగా మారింది.
ఐదేళ్ళపాటు వీర్యం ఉత్పత్తి కేంద్రంగా పనిచేసిన బీబీసీ 2005 నుంచి కేవలం ముర్రాజాతి దున్నలు, జెర్సీ, ఒంగోలు జాతి కోడెదూడల కేంద్రంగా మారింది.
గతంలో డిప్యూటీ డెరైక్టర్, అడిషనల్ డిప్యూటీ డెరైక్టర్, శాస్త్రవేత్తలు, వైద్యులు, వందమంది సిబ్బంది, 10 ట్రాక్టర్లతో కళకళలాడిన బీబీసీ కేంద్రం నేడు వెలవెలబోతోంది. ప్రస్తుతం ఒక డాక్టర్ మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు.
భూములపై కన్ను...
త్రిపురాపురంలో ఉన్న 130 ఎకరాల భూములను ఆక్రమించుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ఈ కేంద్రంపై ప్రభుత్వం శ్రద్ధ వహించి పశుపరిశోధనా సంస్థగా మారిస్తే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పశువులకు అవసరమైన వీర్యాన్ని ఇక్కడి నుంచే అందించే వీలుంటుందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేంద్రంలో గడ్డి పెంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. ఈ ఆలోచన కార్యరూపం దాల్చినా వేసవిలో పశువులకు మేతలేక ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలు తీరడంతో పాటు పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు.
చూడీ లేదు..పాడీ లేదు
Published Fri, Feb 21 2014 1:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement