కిడ్నాపర్ల చెరలోనే దామోదర్ | Nine years old boy kidnapped for ransom in Visakhapatnam | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్ల చెరలోనే దామోదర్

Sep 14 2014 11:03 AM | Updated on May 3 2018 3:17 PM

కిడ్నాపర్ల చెరలోనే దామోదర్ - Sakshi

కిడ్నాపర్ల చెరలోనే దామోదర్

అపహరణకు గురైన పెందుర్తి బాలుడు కోరుబిల్లి దామోదర్(9) కిడ్నాప్ మిస్టరీ ఇంకా వీడలేదు.

విశాఖపట్నం: అపహరణకు గురైన పెందుర్తి బాలుడు కోరుబిల్లి దామోదర్(9) కిడ్నాప్ మిస్టరీ ఇంకా వీడలేదు. కిడ్నాప్ జరిగి ఏడు జరిగినా అతడి ఆచూకీ లభించలేదు. కుమారుడి జాడ తెలియకపోవడంతో దామోదర్ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తమ కొడుకు సురక్షితంగా రావాలని వారు కోరుకుంటున్నారు.

వడ్డీ వ్యాపారి కోరుబిల్లి శ్రీనివాసరావు కుమారుడైన దామోదర్... పెందుర్తి మండలం చింతలగ్రహారంలో ఈ నెల 8న  కిడ్నాపయ్యాడు. రూ.30 లక్షలు ఇవ్వకుంటే తన కొడుకును చంపుతామంటూ కిడ్నాపర్లు బెదిరించారని శ్రీనివాసరావు తెలిపారు. ఏడాది కాలంగా రూ.30 లక్షల రుణం వ్యవహారంలో శ్రీనివాసరావుకు, మరో వ్యక్తికి వివాదం నడుస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement