కత్తిపోట్లతో ఎస్పీ ఆఫీసుకు. | Mudder Attack Knife Sp Office He Is Come | Sakshi
Sakshi News home page

కత్తిపోట్లతో ఎస్పీ ఆఫీసుకు.

Apr 15 2018 8:32 AM | Updated on Jun 1 2018 8:36 PM

Mudder Attack Knife  Sp Office He Is Come - Sakshi

అంబులెన్స్‌లో ఉన్న క్షతగాత్రుడు రాజేష్‌

అనంతపురం సెంట్రల్‌ : కత్తిపోట్లకు గురైన బాధితుడు తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఘటన శనివారం చోటు చేసుకుంది. రక్తమోడుతున్న అతన్ని డీఎస్పీ వెంకటరావు చొరవతో ఆస్పత్రికి తరలించారు. బాధితులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. యాడికి మండలం రాయలచెరువులో ఉదయం 7 గంటల సమయంలో శ్రీరామ్‌ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేసే రాజేష్‌ (35)పై హత్యాయత్నం జరిగింది. సొంత బావ (అక్క భర్త) రవిప్రసాద్, మరో వ్యక్తి ఈశ్వరయ్యతో కలిసి కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచేశారు. రక్తమోడుతున్న రాజేష్‌ను కుటుంబ సభ్యులు నేరుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రథమ చికిత్స అనంతరం నేరుగా అంబులెన్స్‌లో ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. తన భర్తకు రక్షణ కల్పించా లని, యాడికి పోలీసులను వేడుకున్నా పట్టించు కోలేదని, క్షతగాత్రుడి భార్య భాగ్యలక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. అక్కడికి సకాలంలో చేరుకున్న అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్‌ వెంటనే హాస్పటల్‌కు డీఎస్పీ ఆదేశాలతో క్షతగాత్రుడిని కుటుంబ సభ్యు లు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement