విజయనగరం మున్సిపాలిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాడని రెండేళ్ల పాలనలో ప్రజలు గమనించారని, 2019 ఎన్నికల్లో వారు తగిన బుద్ధి చెప్పటం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఆయ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తిరుపతిలో నిర్వహించిన మహానాడులో ఒక్కటైనా ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయకపోగా.. ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీలనైనా ప్రస్తావించకపోవటం విచారకరమన్నారు .
ప్రపంచం ఆశ్చర్యపడేలా రాజధాని నిర్మిస్తామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు, ఈవిషయంలో జగన్మోహన్రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ చేస్తున్న విషప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రాజధాని నిర్మాణానికి జగన్ అడ్డుపడుతున్నారన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు చూపించగలరా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేక, సాయం చేయమని అడగలేక, బీజేపీ కాళ్ల ముందు మోకరిల్లుతున్న చంద్రబాబు ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారని ధ్వజమెత్తారు.
కోటీశ్వరులైన సుజనాచౌదరి, టీజే వెంకటేష్లకు రాజ్యసభ సీట్లు కేటాయించేందుకు ఎన్ని రూ.కోట్ల ముడుపులు తీసుకున్నారో, విపక్ష ఎమ్మెల్యేల కొనుగోలుక డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియజేయాలన్నారు. కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు ఏపీ నుంచి రాజ్యసభ టిక్కెట్టు ఖరారు చేసేముందు, విశాఖ ప్రత్యేక జోన్ ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాపాలు చేసిన వారే దేవాలయాల హుండీలో డబ్బు వేస్తారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించి భక్తు మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఆయన వెన్నుపోటు రాజకీయాలకు ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికీ క్షోభిస్తూనే ఉంటుందన్నారు.
జగన్పై దుష్ర్పచారం చేస్తే సహించం
Published Tue, May 31 2016 11:59 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement