అర్చకుల జీతాలు 25 శాతం పెంచుతాం | Minister Vellampalli Srinivas Say Priest Salary Will Increase 25 Percent | Sakshi
Sakshi News home page

అర్చకుల జీతాలు 25 శాతం పెంచుతాం

Oct 9 2019 7:53 PM | Updated on Oct 9 2019 7:56 PM

Minister Vellampalli Srinivas Say Priest Salary Will Increase 25 Percent - Sakshi

సాక్షి, అమరావతి : అర్చకుల సంక్షేమానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన అర్చక సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్చకులకు సంబంధించిన అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం​ సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్చకుల జీతాలను 25శాతం పెంచుతామని చెప్పారు. వంశపారంపర్య అర్చకత్వంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అర్చకుల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం జగన్‌ ఆలోచన అని, వారి బాగుకోసం ఏదైనా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు  ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లాం, దేవాదాయశాఖ అధికారులు, 13 జిల్లాల అర్చక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement