తమిళనాడులో రేషన్ డిపోల నిర్వహణపై అధ్యయనం చేయడానికి బుధవారం ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల మంత్రి సునీత చెన్నై వెళ్లనున్నారు.
రేషన్ డిపోల అధ్యయనానికి చెన్నైకి వెళ్లనున్న సునీత
Jul 29 2014 7:54 PM | Updated on Sep 2 2017 11:04 AM
హైదరాబాద్: తమిళనాడులో రేషన్ డిపోల నిర్వహణపై అధ్యయనం చేయడానికి బుధవారం ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల మంత్రి సునీత చెన్నై వెళ్లనున్నారు. మంత్రి సునీత వెంట ఏపీ అధికారుల బృందం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఏపీలో కూడా తమిళనాడు తరహా విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని అధికారులు వెల్లడించారు. రెండు రోజులపాటు చెన్నైలో మంత్రి సునీత బృందం పర్యటించనుంది.
Advertisement
Advertisement